Aamir Khan : సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో అట్లీ, బన్నీతో కలిసి కొత్త మూవీని ప్లాన్ చేసింది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి పోస్టర్, వీడియోను రిలీజ్ చేసింది. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా ఉండబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్. తనకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇండియన్ సినిమాలో 2వ అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ మూవీలో బన్నీ, రష్మిక మందన్నా కీ రోల్ పోషించారు. రూ. 1867 కోట్లు వసూలు చేసింది.
Aamir Khan Get Key Role in Atlee Movie
తాత్కాలికంగా అట్లీ టైటిల్ ను కూడా ఖరారు చేశాడు. ఏఏ22 అని పేరు పెట్టాడు. పుష్ప 2 బిగ్ హిట్ అయ్యాక ఎవరితో సినిమా చేస్తాడనే ఉత్కంఠకు తెర దించే ప్రయత్నం చేశాడు బన్నీ. మొదట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయాలని అనుకున్నాడు. కానీ కథా పరంగా ఇంకా మార్పులు చేయాల్సి ఉండడంతో అంత లోపు అట్లీతో చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ మేరకు ఒప్పందం కూడా కుదిరింది. ఈ ఏఏ22 మూవీని హాలీవుడ్ రేంజ్ లో తీయనున్నాడు డైరెక్టర్.
ఈ సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు టాక్. మరో వైపు ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ఖరారు చేసే పనిలో పడ్డాడు అట్లీ. తను ఒక్కసారి కమిట్ అయ్యాడంటే ఇక ఆగడు. భారీ రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నట్లు వినికిడి. ఈ చిత్రం అంతర్జాతీయ ప్రామాణిక విజువల్స్ తో నిండిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చి దిద్దనున్నాడు అట్లీ కుమార్. తాజాగా ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్(Aamir Khan) విలన్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం.
Also Read : Hero Mohan Lal-Tudarum :రూ.120 కోట్లు తుడరుమ్ వసూళ్లు