మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నటుడు నారా రోహిత్ పై . తన తీరు బాగోలేదంటూ సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేస్తానంటూ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇద్దరి మధ్య ఏమైందని, ఎందుకు గొడవ పడ్డారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఇద్దరి నటుల మధ్య సంభాషణలు. దీంతో అంతా నిజమేనని నమ్మారు. కానీ వీరు కలిసి భైరవం సినిమాలో నటించారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా తనను ఆట పట్టించాడు మంచు మనోజ్.
ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ శాంతించారు. మొత్తంగా భైరవం మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. టేకింగ్, మేకింగ్ డిఫరెంట్ గా ఉండడంతో దీనిపై మరింత ఆసక్తిని పెంచుతోంది. దీనిని విజయ్ కనకమేడల దర్శకత్వం వహించగా కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. దీనిని శ్రీ సత్య సాయి పతాకంపై నిర్మించడం విశేషం. చాన్నాళ్ల తర్వాత మంచు మనోజ్ భైరవం చిత్రంలో కనిపిస్తుండడం విశేషం.
వాస్తవానికి తమిళంలో వచ్చింది ఈ మూవీ. దీనిని తెలుగులో తీశారు దర్శకుడు. ఇందులో ముగ్గురు హీరోలు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్. ఇక ఇటీవలే తన తండ్రి చని పోయాడు రోహిత్ కు. తను కేవలం కొన్ని ఎంపిక చేసిన కథలకు మాత్రమే ఓకే చెప్పాడు. మొత్తం మీద భైరవం అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంటుందని ప్రకటించారు మూవీ మేకర్స్. ఏ మేరకు వర్కవుట్ అవుతుందో రిలీజ్ అయితే కానీ చెప్పలేం.