బహు భాషా నటిగా గుర్తింపు పొందారు నిత్యా మీనన్. సినిమా రంగానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్లు అనేసరికల్లా చులకన భావం ఉంటుందని, తాము కూడా మనుషులమేనని పేర్కొంది. తాము ఆట బొమ్మలం కామంటూ స్పష్టం చేసింది. తను అలా మొదలైంది సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంది.
ప్రముఖ నటుడు ధనుష్ తో కలిసి ఇడ్లి కడై మూవీలో కీ రోల్ పోషించింది. అంతకు ముందు టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించి మెప్పించింది. తను ఎంపిక చేసుకునే పాత్రలు సెలెక్టివ్ గా ఉంటున్నాయి. పాత్రలకు ప్రాధాన్యత అనేది ఉండాలని, అది ప్రేక్షకుల హృదయాలలో నిలిచి పోయేలా చూడాలని కోరుతోంది. ఇటు మలయాళం, అటు తమిళ్, తెలుగు సినిమాలలో తనదైన ముద్ర వేసింది నిత్యా మీనన్.
ప్రతిభ అనేది ఉంటే చాలని, ఎవరి సిఫారసులు అక్కర్లేదని తను ముందు నుంచీ నమ్ముతోంది. అయితే అభిమానులు అప్పుడప్పుడు తమను తాకేందుకు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఎగబడతారని, అది కొన్ని సమయాల్లో తీవ్ర ఇబ్బంది పెడుతుందని వాపోయింది. ఇదే సమయంలో తాజాగా ఓ ఈవెంట్ సందర్బంగా చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
అభిమాని షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు నిత్యా మీనన్ కు. తనకు జలుబు ఉందని నమస్కారం పెట్టి వెళ్లింది. స్టేజి పైకి వెళ్లాక హీరోకు షేక్ హ్యాండ్ ఇచ్చింది. దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏసింది నటి.