టాలీవుడ్ లో అనుకోకుండా ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా. తను చదవులో టాప్. మంచి యూనివర్శిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసింది. ఐఏఎస్ కావాలని కలలు కింది. ఆ దిశగా ప్రయత్నం చేసింది కూడా. కానీ ఉన్నట్టుండి సినీ రంగంలోకి ప్రవేవించింది. తన 11 ఏళ్ల సినీ కెరీర్ లో ఆశించినంతగా బిగ్ హిట్స్ లేవు. అడపా దడపా మంచి పాత్రలు దక్కడం, సినిమాలను చూసి సంతృప్తి చెందుతోంది. మంచి అందంతో పాటు అభినయం కూడా చేస్తుండడంతో వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. కానీ బ్లాక్ బస్టర్ మూవీ ఏది లేక పోవడంతో కొంత నిరాశకు లోనవుతోంది ఈ ముద్దుగుమ్మ.
తను శ్రీరామ్ కాలేజీలో ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకుంది. సాహిత్యం పై మంచి పట్టుంది. వివిధ అంశాలపై కూడా అవగాహన ఉంది. తొలుత తన కెరీర్ ను యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్ గా పని చేసింది. ఆ తర్వాత మోడలింగ్ కు వెళ్లింది. పేరు పొందిన ప్రముఖ బ్రాండ్ లతో జతకట్టింది. ఇదే సమయంలో తను దర్శకుడు శూజిత్ సిరికార్ కంట పడింది. తను మద్రాస్ కేఫ్ మూవీ కోసం జాన్ అబ్రహం కోసం జోడీగా తీసుకున్నాడు. ఆ మూవీలో తనకు మంచి పేరు తెచ్చింది.
ఆ తర్వాత దక్షిణాదిలోకి ప్రవేశించింది. తెలుగులో ఊహలు గుస గుల లాడే మూవీలో కీ రోల్ పోషించింది. తమిళంలో ఇమ్మాయికల్ నోదిగల్ , మలయాళంలో విలన్ చిత్రాలలో నటించింది.. బెంగాల్ టైగర్, జై లవకుశ, సుప్రీమ్, తొలి ప్రేమ, వెంకీ మామ, ప్రతి రోజూ పండగే, సర్దార్, రుద్ర, ఫర్దీ తదితర మూవీస్ లో తళుక్కున మెరిసింది రాశీ ఖన్నా. సినిమాలలో కాకుండా వెబ్ సీరీస్ లో విజయ్ సేతుపతితో నటించింది. ప్రస్తుతం నీరజ్ కోనా దర్శకత్వం వహిస్తున్న తెలుసు కదా మూవీపైనే ఫోకస్ పెడుతున్నట్లు తెలిపింది.