Renu Desai : జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా పెహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన దాడి పట్ల యావత్ ప్రపంచం విస్తు పోయింది. సంతాపం వ్యక్తం చేస్తోంది. యావత్ భారతమంతా ముక్తకంఠంతో బాధాతప్త హృదయంతో విలవిలలాడింది. ఈ ఘటనకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించ వద్దంటూ కోరింది. సాధ్యమైనంత త్వరగా బదులు తీర్చుకోవాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఈ మొత్తం అమానవీయ ఘటన పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. ఇది రాబోయే రోజుల్లో మరింత పెరిగే ప్రమాదం ఉందంటూ హెచ్చరిస్తోంది సభ్య సమాజం.
Renu Desai Shocking Comments on Pahalgam Terror Attack
26 మంది పర్యాటకులపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడటం పట్ల మానవత్వం చచ్చి పోయిందంటూ పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం అవుతోంది. ఈ సందర్బంగా తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు ప్రముఖ నటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్(Renu Desai). నిన్నటి దాకా గొంతు చించుకుని అరిచిన వాళ్లు, గోల చేసిన వాళ్లు ఏమై పోయారంటూ నిలదీసింది. తీవ్రంగా ప్రశ్నించింది. ఈ విపత్కర సమయంలో కావాల్సింది కామెంట్స్ చేయడం కాదు..ఏం చేస్తే బావుంటుందో ముందుకు ప్రత్యక్షంగా పాలు పంచుకోవాల్సిన అవసరం ఉందంటూ స్పష్టం చేసింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. మీది ఏ మతం అంటూ అడిగి కాల్చి చంపడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మొత్తం ఘటనపై తీవ్రంగా స్పందించారు సినీ సెలబ్రిటీలు. రేణూ దేశాయ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్ఎస్ రాజమౌళి, కీర్తి సురేష్, రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, విజయశాంతి, ఈషా రెబ్బా, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నిఖిల్ సిద్దార్థ్ , ప్రియదర్శి ఉగ్రదాడిని ఖండించారు.
Renu Desai Shocking Comment :సెక్యులర్స్ మౌనం రేణూ దేశాయ్ ఆగ్రహం
పెహల్గామ్ దారుణంపై నిప్పులు చెరిగిన నటి
Renu Desai : జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా పెహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన దాడి పట్ల యావత్ ప్రపంచం విస్తు పోయింది. సంతాపం వ్యక్తం చేస్తోంది. యావత్ భారతమంతా ముక్తకంఠంతో బాధాతప్త హృదయంతో విలవిలలాడింది. ఈ ఘటనకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించ వద్దంటూ కోరింది. సాధ్యమైనంత త్వరగా బదులు తీర్చుకోవాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఈ మొత్తం అమానవీయ ఘటన పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. ఇది రాబోయే రోజుల్లో మరింత పెరిగే ప్రమాదం ఉందంటూ హెచ్చరిస్తోంది సభ్య సమాజం.
Renu Desai Shocking Comments on Pahalgam Terror Attack
26 మంది పర్యాటకులపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడటం పట్ల మానవత్వం చచ్చి పోయిందంటూ పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం అవుతోంది. ఈ సందర్బంగా తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు ప్రముఖ నటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్(Renu Desai). నిన్నటి దాకా గొంతు చించుకుని అరిచిన వాళ్లు, గోల చేసిన వాళ్లు ఏమై పోయారంటూ నిలదీసింది. తీవ్రంగా ప్రశ్నించింది. ఈ విపత్కర సమయంలో కావాల్సింది కామెంట్స్ చేయడం కాదు..ఏం చేస్తే బావుంటుందో ముందుకు ప్రత్యక్షంగా పాలు పంచుకోవాల్సిన అవసరం ఉందంటూ స్పష్టం చేసింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. మీది ఏ మతం అంటూ అడిగి కాల్చి చంపడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మొత్తం ఘటనపై తీవ్రంగా స్పందించారు సినీ సెలబ్రిటీలు. రేణూ దేశాయ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్ఎస్ రాజమౌళి, కీర్తి సురేష్, రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, విజయశాంతి, ఈషా రెబ్బా, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నిఖిల్ సిద్దార్థ్ , ప్రియదర్శి ఉగ్రదాడిని ఖండించారు.