ప్రముఖ నటి స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. పలు విజయవంతమైన సినిమాలలో నటించింది. ఆ మధ్యన మెప్పించింది కూడా. తమిళం, తెలుగు చిత్రాలలో కీ రోల్స్ పోషించింది. వాస్తవానికి తన పేరు స్నేహ కాదు సుహాసిని. సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకుంది. తను గతంలో నటించిన చిత్రాలు బిగ్ సక్సెస్ అయ్యాయి. వాటిలో సంక్రాంతి, రాధా గోపాలం, శ్రీరామదాసు ఉన్నాయి. తను నటించిన మొదటి మూవీ మలయాళంలో వచ్చిన ఎంగనే ఒరు నీల పక్షి.
తమ తాతల స్వస్థలం రాజమండ్రి. అయితే ముంబైలో పుట్టింది స్నేహ. బతుకు దెరువు కోసం తన ఫ్యామిలీ దుబాయ్ కి వెళ్లింది. అక్కడ మలయాళం దర్శకుడు ఫాజిల్ కంట పడింది. తను తనను దర్శకులకు సిఫారసు చేశాడు. 2000లో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. మలయాళ మూవీ ఆశించిన మేర ఆడలేదు. స్నేహ 2011లో ప్రసన్నతో పెళ్లి చేసుకుంది. తనకు ఇద్దరు పిల్లలు. 2001లో విరుంబిగెరన్ లో నటించింది. ఆ తర్వాత వరుసగా సినిమాలలో చాన్స్ లు వచ్చాయి.
తెలుగు, తమిళం, మలయాళం చలన చిత్ర సీమలలో అగ్ర కథానాయకుల సరసన నటించింది. తొలి వలపు, ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్ , మహారథి, మధు మాసం, నీ సుఖమే నే కోరుకున్నా , దటీజ్ పాండు, వెంకీ, ఏవండోయ్ శ్రీవారు, మనసు పలికే మౌనరాగం, ఆదివిష్ణు, పాండు రంగడు, సన్నాఫ్ సత్య మూర్తి, వినయ విధయ రామ, తదితర చిత్రాలలో నటించింది. తాజాగా ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ లో స్నేహ డాక్టర్ గా నటించింది. ఈ సందర్బంగా తను షాకింగ్ కామెంట్స్ చేసింది. తన ఫెవరేట్ హీరో అజిత్ అంటూ చెప్పుకొచ్చింది.