Sree Leela : నేషనల్ బ్యూటీ శ్రీలీల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ముంబై వేదికగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వేవ్స్ నిర్వహించింది. భారీ ఎత్తున ఖర్చు చేసింది. ఈ అరుదైన , విశిష్టమైన కార్యక్రమం నభూతో నభవిష్యత్ అన్న చందంగా జరిగింది. దేశంలోని ప్రముఖ నటీ నటులంతా కొలువు తీరారు. తమ జీవితంలో జరిగిన అనుభవాలను వివరించే ప్రయత్నం చేశారు. సూపర్ స్టార్స్ రజనీకాంత్, శివ రాజ్ కుమార్, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, అక్షయ్ కుమార్, రణ్ బీర్ కపూర్, దీపికా పదుకొనే, హేమ మాలిని, రేఖ, అమితాబ్ బచ్చన్ తో పాటు యంగ్ స్టార్స్ , హీరో హీరోయిన్లు హాజరయ్యారు.
Sree Leela in Waves Summit
మొత్తంగా ముంబై నగరం తారలతో తళుక్కుమంది. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సినీ నటీనటులు, దర్శక, నిర్మాతలు, సాంకేతిక నిపుణులను ఉద్దేశించి ప్రసంగించారు. మీరంతా దేశంకోసం చేస్తున్న కృషిని ప్రశంసిస్తున్నానని అన్నారు. దీనిపై స్పందించారు ప్రముఖ నటి శ్రీలీల(Sree Leela) . తన అభిప్రాయాలను పంచుకున్నారు. వేవ్స్ ను నిర్వహించడం అభినందనీయమన్నారు. దాదాపు 75 దేశాల నుండి ప్రజలను ఏకతాటిపైకి తీసుకు వచ్చిన తీరు తనను ఆకట్టుకుంటుందని చెప్పారు. దీనిని నిజంగా ప్రపంచ వ్యాప్త క్షణంగా పేర్కొన్నారు.
ప్రధాని మాట్లాడిన మాటలు, చేసిన ప్రసంగం ఎంతో మందికి స్పూర్తి దాయకంగా నిలుస్తుందన్నారు శ్రీలీల. నాకు మాటలు రావడం లేదన్నారు. ఎందరో నేతలను చూశానని, కానీ ప్రధాని మోదీ లాంటి జన నాయకుడిని తాను చూడలేదంటూ చెప్పారు శ్రీలీల. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ప్రధాని ప్రసంగం అద్భుతం అంటూ కొనియాడారు.
Also Read : Natural Star Nani-Hit 3 :నేచురల్ స్టార్ నాని హిట్ -3 కలెక్షన్ల సునామి