కరుణ్ నాయర్ టీమిండియాకు ఎంపిక అవుతాడని ఎవరూ ఊహించ లేదు. చివరకు తను కూడా కలలో కూడా అనుకోలేదు. దీనికి కారణం ఎవరైనా ఒకటి లేదా రెండు ఏళ్లు గ్యాప్ తీసుకుంటారు. కానీ తను టెస్టు మ్యాచ్ ఆడి దాదాపు ఎనిమిది సంవత్సరాలకు పైగా అవుతోంది. తనను ఏరికోరి ఐపీఎల్ కు తీసుకున్నారు. తన సత్తా ఏమిటో చూపించాడు నాయర్. అద్భుతమైన పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఆయా ఆటగాళ్ల ఆట తీరును నిశితంగా గమనించింది బీసీసీఐ. ఐపీఎల్ వేరు ఇతర టీ20, వన్డే, టెస్టు ఫార్మాట్ లు వేర్వేరు.
ఒక్కో ఫార్మాట్ కు ఆట తీరు భిన్నంగా ఉంటుంది. తాజాగా భారత జట్టు ఇంగ్లండ్ తో టెస్టు సీరీస్ ఆడాల్సి ఉంది. ఇందు కోసం ముంబై వేదికగా కీలక సమావేశం నిర్వహించింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ తో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాల్గొన్నాడు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ జట్టును ప్రకటించారు. యంగ్ క్రికెటర్ శుభ్ మన్ గిల్ కు బంపర్ ఛాన్స్ ఇచ్చారు. తనను స్కిప్పర్ గా ఎంపిక చేశారు. తనకు తోడుగా రిషబ్ పంత్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు. విచిత్రం ఏమిటంటే ఐపీఎల్ టోర్నీలో అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచాడు.
తనను ఏరికోరి లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం రూ. 27 కోట్లకు తీసుకుంది దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ వేలం పాటలో. తను చేసిన పరుగులు 12 మ్యాచ్ ఆడి 141 రన్స్. దీంతో ఆ జట్టు యజమాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేవలం కోటి 10 లక్షలకే తీసుకున్న వైభవ్ సూర్య వంశీ రాజస్థాన్ జట్టులో కీలక పాత్ర పోషించాడు. ఇక కరుణ్ నాయర్ విషయానికి వస్తే తనను ఎంపిక చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తన సత్తా ఏమిటో చూపిస్తానని అన్నాడు.