Hero Allu Arjun-AISF :విద్యా సంస్థ‌ల ప్ర‌మోష‌న్స్ ఇబ్బందుల్లో న‌టులు 

బ్రాండ్ అంబాసిడ‌ర్స్ గా అల్లు అర్జున్..శ్రీ‌లీల

Allu Arjun : త‌మ త‌మ సినిమాల‌తో బిజీగా ఉన్నారు న‌టీ న‌టులు. ఇదే స‌మ‌యంలో కొన్ని సంస్థ‌ల‌కు ప‌నిగ‌ట్టుకుని బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా ఉండ‌డం, వీరిని అడ్డం పెట్టుకుని ఆయా కంపెనీలు, సంస్థ‌లు ప్ర‌చారం చేసుకోవ‌డం, మోసాల‌కు పాల్ప‌డ‌డం ష‌రా మామూలై పోయింది. తాజాగా టాలీవుడ్ కు చెందిన సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ నోటీసులు జారీ చేసింది. అంతే కాకుండా ఈనెల 28న త‌మ ముందు విచార‌ణ‌కు రావాల‌ని స‌మ‌న్లు ఇచ్చింది.

Allu Arjun Movie Promotions Issue

ఇదే స‌మ‌యంలో చాలా మంది హీరో హీరోయిన్లు ప‌లు సంస్థ‌ల‌కు ప్ర‌చారం చేస్తూ వ‌స్తున్నారు. కోట్లు వెన‌కేసుకుంటున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. సురానా గ్రూప్, సూర్య డెవ‌ల‌ప‌ర్స్ సంస్థ‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్న మ‌హేష్ బాబు ప్ర‌చారం చేసినందుకు గాను రూ. 11 కోట్లు వెన‌కేసుకున్న‌ట్లు ఈడీ గుర్తించింది. ఇదే స‌మ‌యంలో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ తో పాటు ల‌వ్లీ బ్యూటీ శ్రీ‌లీల కూడా విద్యా సంస్థ‌ల‌కు ప్ర‌మోషన్స్ చేయ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది.

ప్ర‌స్తుతం బ‌న్నీ(Allu Arjun) అట్లీతో మూవీ చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. ఇక శ్రీ‌లీల హిందీలో ఆషిఖి 3 మూవీలో న‌టిస్తోంది. ఇందులో కార్తీక్ నారాయ‌ణ‌న్ కీ రోల్ పోషిస్తున్నాడు. త‌ను ఎన్నో కంపెనీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్నాడు. అటు సినిమాల‌తో ఇటు ప్ర‌చారంతో చేతినిండా సంపాదిస్తున్నాడు. తాజాగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంస్థ బ‌న్నీపై మండిప‌డింది.

తెలంగాణ‌లో కార్పొరేట్ కాలేజీల‌ను ప్రోత్స‌హించినందుకు కేసు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేసింది. 2021లో శ్రీ చైత‌న్య విద్యా సంస్థ‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ప‌ని చేశాడు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన జేఈఈ ఫ‌లితాల్లో త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చాయ‌ని ఆరోపించింది. అల్లు అర్జున్ తో పాటే శ్రీ‌లీల కూడా విద్యా సంస్థ‌ల‌కు ప్ర‌చారం చేసింది. త‌న‌పై కూడా కేసు న‌మోదు చేయాల‌ని కోరారు స్టూడెంట్స్ యూనియ‌న్ లీడ‌ర్స్.

Also Read : Hero Nani Shocking Comment :విమ‌ర్శ‌లు పట్టించుకోను ప్ర‌మోష‌న్స్ ఆపను

allu arjunSree LeelaUpdatesViral
Comments (0)
Add Comment