Desamuduru : టాలీవుడ్ లో దమ్మున్న దర్శకుడు పూరీ జగన్నాథ్. తను తీసే సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయి. మేకింగ్ లో తనకు తనే సాటి. ఈ మధ్యన తీసిన మూవీస్ అంతగా వర్కవుట్ కాలేదు. విజయ్ దేవరకొండ, అనన్య పాండే తో తీసిన లైగర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ సినిమా బెడిసి కొట్టింది. అయినా ఎక్కడా తగ్గడం లేదు. మరో కొత్త ప్రాజెక్టును ప్రకటించాడు. పాన్ ఇండియా లెవల్లో మూవీ తీస్తానంటూ ప్రకటించాడు. ఇందులో కీ రోల్ పోషిస్తున్నాడు తమిళ సినీ నటుడు విజయ్ సేతుపతి. ఇందులో కీ రోల్ పోషించనుంది టబు. తాజాగా పూరీ జగన్నాథ్ కు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది.
Hero Allu Arjun Desamuduru Re-Release
టాలీవుడ్ లో కొత్త సంప్రదాయం మొదలైంది. ఇప్పటికే విడుదలై బంపర్ హిట్ సాధించిన మూవీస్ తిరిగి రీ రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్ కు సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇదే కోవలోకి వచ్చాడు పాన్ ఇండియా సూపర్ స్టార్ అల్లు అర్జున్. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన దేశ ముదురు మూవీ బిగ్ హిట్ గా నిలిచింది. ఇందులో బన్నీ కీలక పాత్ర పోషించాడు. ఇందులో సిక్స్ ప్యాక్ ను ప్రదర్శించాడు హీరో. పూరీ జగన్నాథ్ తీసిన వాటిలో రవితేజతో తీసిన ఇడియట్, మహేష్ బాబుతో తీసిన పోకిరి, బన్నీతో తీసిన దేశ ముదురు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.
అల్లు అర్జున్ నటించిన దేశముదురు(Desamuduru) చిత్రం 2007 జనవరి 12న సంక్రాంతి సందర్బంగా విడుదలైంది. తిరిగి ఇదే చిత్రాన్ని వచ్చే మే నెల 10వ తేదీన తిరిగి విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం బన్నీ హవా దేశ వ్యాప్తంగా నడుస్తోంది. తను నటించిన పుష్ప 2 సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇది ఏకంగా రూ. 1867 కోట్లు వసూలు చేసింది. దేశంలోనే అత్యధిక వసూలు చేసిన రెండో మూవీగా రికార్డ్ బ్రేక్ చేసింది. బన్నీ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Also Read : Hero Akshay Kumar-Kesari 2 :రూ. 50 కోట్లు దాటేసిన కేసరి చాప్టర్ 2 కలెక్షన్స్