Allu Arjun : ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ బన్నీపై నంద్యాల 2 టౌన్ పిఎస్ లో కేసు

శనివారం అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లి మద్దతు తెలిపారు....

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా వేలాది మంది పాల్గొన్న ర్యాలీలో అల్లు అర్జున్ పాల్గొన్నారని పలువురు ఫిర్యాదుల మేరకు పోలీసులు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు.

Allu Arjun Got Police Case

నంద్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులపై ఏపీ చట్టంలోని 31వ సెక్షన్ ఎలక్షన్ యాక్ట్ సెక్షన్ 144 అమల్లో ఉంది కాబట్టి అనుమతి లేకుండా వేల సంఖ్యలో జనం గుమిగూడడం నేరం. ప్రత్యేక ఎంపీపీ తహశీల్దార్‌ ఫిర్యాదు మేరకు నంద్యాల టూటౌన్‌ పీఎస్‌ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి, అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది.

శనివారం అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లి మద్దతు తెలిపారు. బన్నీని చూసేందుకు వేలాదిగా అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. వీధుల్లోకి జనం పోటెత్తడంతో విస్తుపోయామని స్థానికులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు.

Also Read : Shivam Bhaje: ఊర మాస్ గా ‘శివం భజే’ ఫస్ట్ లుక్ !

allu arjunBreakingUpdatesViral
Comments (0)
Add Comment