Allu Arjun-Pushpa 2 : టికెట్ రేట్ల పెంపునకు ఆమోదించిన ఏపీ సర్కార్ కు ధన్యవాదాలు తెలిపిన బన్నీ

‘పుష్ప2’ విడుదల రోజై అనగా డిసెంబర్‌ 5న ఆరు షోలకు అనుమతి ఇచ్చింది...

Pushpa 2  : ఆంధ్రప్రదేశ్‌లో ‘పుష్ప2’ టికెట్‌ ధర పెంచుకోవడానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు అధికారిక జీవో విడుదల చేశారు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. రష్మిక మందన్నా కథానాయిక. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా టికెట్‌ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది డిసెంబర్‌ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్‌ షోతోపాటు, అర్థరాత్రి 1 గంట షోకు కూడా అనుమతి ఇచ్చింది. రాత్రి 9.30 షోకు టికెట్‌ ధరను రూ.800గా నిర్ణయించారు (జీఎస్టీ అదనం). ఈ షో చూడాలంటే రాష్ట్రవ్యాప్తంగా సింగిల్‌ స్క్రీన్ , మల్టీఫ్లెక్స్‌ ఏదైనా సరే రూ.800+ జీఎస్‌టీ చెల్లించాల్సిందే.

Allu Arjun-Pushpa 2

‘పుష్ప2(Pushpa 2)’ విడుదల రోజై అనగా డిసెంబర్‌ 5న ఆరు షోలకు అనుమతి ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్లలో లోయర్‌ క్లాస్‌ జీఎస్టీతో కలిపి రూ.100, అప్పర్‌ క్లాస్‌ జీఎస్టీతో కలిపి రూ.150, మల్టీఫ్లెక్స్‌లో జీఎస్టీతో కలిపి రూ.200 పెంచారు. డిసెంబర్‌ 6వ తేదీ నుంచి 17 వరకు ఐదు షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు 17 వరకూ పెంచిన టికెట్‌ ధరలు అమల్లో ఉంటాయి. టికెట్‌ ధరలు పెంపునకు అనుమతి ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లకు కథానాయకుడు అలు అర్జున్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘పుష్ప2’ ఆరు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 12 వేల థియేటర్‌లలో విడుదల కానుంది. ‘‘అత్యధిక థియేటర్లలో ఐమాక్స్‌ ఫార్మాట్‌లో విడుదలవుతున్న భారతీయ చిత్రమిది. సినీడబ్స్‌ యాప్‌ సహాయంతో ఏ భాషతోనైనా ఈ సినిమాని ఆచూసే అవకాశం ఉందని నిర్మాతలు చెప్పారు.

Also Read : SS Rajamouli : ‘పుష్ప 2’ సినిమాకి భారీ హైప్ ఇచ్చిన జక్కన్న

allu arjunPushpa 2TrendingUpdatesViral
Comments (0)
Add Comment