ఢిల్లీ – కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా నిప్పులు చెరిగారు. దాయాది పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాల్పుల విరమణ అంటూనే ఇంకో వైపు ఉగ్రవాదులను ఉసి గొల్పుతోందని ఆరోపించారు. ఇంకోసారి గనుక పీఓకేలోకి ఎవరు అడుగు పెట్టినా లేపేస్తామని అన్నారు. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా, దాక్కున్నా పట్టుకుని కాల్చి పారేస్తామని పేర్కొన్నారు. ఇకనైనా పాకిస్తాన్ తన తీరు మార్చుకోవాలని లేక పోతే పుట్టగతులు ఉండవని చెప్పారు.
జాతిని ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించారు. సమర్థవంతమైన నాయకుడు మోదీ ఉండడం భారత దేశానికి గర్వ కారణమన్నారు. ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. తమ దేశానికి సంబంధించి ఇంకొకరి జోక్యం సహించ బోమంటూ స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. తోక జాడిస్తే పాకిస్తాన్ తాట తీస్తామని మరోసారి హెచ్చరించారు. పాక్ ఆర్మీ చీఫ్ , జైషే మహమ్మద్, షెహబాజ్ షరీఫ్ లు నోరు అదుపులో పెట్టుకోవాలని లేక పోతే చర్యలు తప్పవన్నారు.
తామంతకు తాముగా పాకిస్తాన్ తో చర్చలు జరపలేదని స్పష్టం చేశారు అమిత్ షా. పాకిస్తాన్ గత్యంతరం లేక డీజీఎంఓనే భారత డీజీఎంఓతో మాట్లాడారని చెప్పారు. కానీ ప్రపంచానికి అబద్దాలను ప్రచారం చేస్తోందంటూ ధ్వజమెత్తారు అమిత్ షా.