RGV : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు భారీ ఊరట లభించింది. ఏపీ హైకోర్టు శుభ వార్త చెప్పింది. ఆర్జీవీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఈ మేరకు ఏపీ సీఐడీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో దుందుడుకుగా వ్యవహరించ వద్దంటూ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా తనపై నమోదు చేసిన కేసులకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ సీఐడీ పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో సీరియస్ గా స్పందించింది కోర్టు.
Director RGV got Relief
రామ్ గోపాల్ వర్మ పిటిషన్ లో తాను షూటింగ్ లో బిజీగా ఉన్నానని, ప్రత్యేకించి భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు. కావాలని తనను టార్గెట్ చేస్తూ కేసులు నమోదు చేశారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆర్జీవీ(RGV). తనకు నోటీసులు ఇవ్వడం పూర్తిగా తప్పేనంటూ పేర్కొన్నారు. కావాలని తనను టీడీపీ కూటమి సర్కార్ టార్గెట్ చేసిందని ఆరోపించారు. తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
ఒక డైరెక్టర్ గా తాను దేనినైనా తీసే హక్కు తనకు ఉంటుందని స్పష్టం చేశారు. తనను నియంత్రించాలని చూడటం అంటే స్వేచ్ఛను హరించడం తప్ప మరోటి కాదని పేర్కొన్నారు రామ్ గోపాల్ వర్మ. కోర్టులో వాదోపవాదనలు విన్న అనంతరం హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం మంచి పద్దతి కాదని, కానీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉందనే సాకుతో ఎలా పడితే అలా మాట్లాడటం కుదరదని స్పష్టం చేసింది. మొత్తంగా ఆర్జీవీకి బిగ్ రిలీఫ్ దక్కింది.
Also Read : Popular Actor Manoj Kumar :నటుడు మనోజ్ కుమార్ కన్నుమూత