స‌జ్జ‌ల‌కు మ‌హిళా క‌మిష‌న్ స‌మ‌న్లు

మ‌హిళ‌ల‌పై నోరు పారేసుకున్నందుకు

అమ‌రావ‌తి – వైసీపీ అధికార ప్ర‌తినిధి స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డికి కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆయ‌న త‌న నోటికి ప‌ని చెప్పారు. మ‌హిళ‌ల‌ను ఉద్దేశించి స‌భ్య స‌మాజం త‌ల దించుకునేలా మాట్లాడారు. వారిని అన‌రాని మాట‌లు అన్నారు. ఇప్ప‌టికే వేశ్య‌ల రాజ‌ధాని అంటూ సాక్షి ఛానెల్ సాక్షిగా డిబేట్ పెట్ట‌డ‌మే కాకుండా నోరు పారేసుకున్నందుకు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీ‌నివాస రావుకు ఝ‌ల‌క్ ఇచ్చారు పోలీసులు. త‌న‌ను హైద‌రాబాద్ లో ఉండ‌గా లిఫ్ట్ చేశారు. అక్క‌డి నుంచి ఆంధ్రాకు త‌ర‌లించారు. తూళ్లూరు పోలీస్ స్టేష‌న్ లో త‌న‌పై ఫిర్యాదు న‌మోదైంది. ఈ మేర‌కు కేసు న‌మోదు చేశారు.

కొమ్మినేనిని మంగ‌ళ‌గిరి కోర్టులో హాజ‌రు ప‌ర్చారు. త‌న‌కు జ‌డ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ సంద‌ర్బంగా త‌న‌కు 70 ఏళ్లు అని, ప్ర‌త్యేక బెడ్ ఏర్పాటు చేయాల‌ని కోరారు. దీనికి జ‌డ్జి ఒప్పుకోలేదు. అంద‌రి నేర‌స్థుల లాగానే మీరు కూడా ఉండాల్సిందేన‌ని పేర్కొన్నారు. మ‌రో వైపు అమ‌రావ‌తి మ‌హిళా రైతులను వేశ్య‌ల‌తో పోల్చిన అన‌లిస్ట్ కృష్ణంరాజును ప‌ట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఈ అరెస్ట్ ల ప‌ర్వం కొన‌సాగుతుండ‌గానే స‌జ్జ‌ల రామ‌కృష్ణ రెడ్డి నోటికి ప‌ని చెప్పారు. దీంతో రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ సీరియ‌స్ అయ్యింది. ఈ మేర‌కు సుమోటోగా తీసుకుంది. జాతీయ మ‌హిళా క‌మిష‌న్ కు రాష్ట్ర క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ రాయ‌పాటి శైల‌జ సుదీర్గ లేఖ రాసింది. ఈ మేర‌కు స‌జ్జ‌ల‌కు త‌మ ముందు హాజ‌రు కావాల‌ని స‌మ‌న్లు జారీ చేస్తున్న‌ట్లు చెప్పారు.

Comments (0)
Add Comment