WTC 2025 Final : ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ఏసీబీ) కీలక ప్రకటన చేసింది. జూన్ 11న ఇంగ్లండ్ లోని ప్రముఖ స్టేడియం లార్డ్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వేదిక కానుంది. ఇందులో భాగంగా పాల్గొనే ఆసిస్ జట్టును ఖరారు చేసింది. ప్రస్తుతం ఐపీఎల్ 2025(IPL 2025)లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు స్కిప్పర్ గా ఉన్న ప్యాట్ కమిన్స్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది.
Australia WTC 2025 Final
ఆస్ట్రేలియా జట్టు ఫైనల్ లో దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది. ఇక ఆసిస్ జట్టులో 15 మందిని ఎంపిక చేసింది ఏసీబీ. వీరిలో టాప్ ప్లేయర్లకు మరోసారి చోటు దక్కింది. ఏ ఫార్మాట్ లోనైనా దంచి కొట్టే జోష్ హాజిల్ వుడ్, మిచెట్ స్టార్క్ ఉన్నారు. ఇక జట్ల విషయానికి వస్తే సౌతాఫ్రికా 12 టెస్టులు ఆడింది. ఇందులో 8 టెస్టులలో గెలుపొందింది. 69.44 పాయింట్లను సాధించి టాప్ లో నిలిచింది.
ఇక ఆసిస్ టీమ్ 19 మ్యాచ్ లు ఆడింది. 13 మ్యాచ్ లలో విజయం సాధించింది. 67.54 పాయింట్లతో 2వ స్థానంలో నిలించింది పాయింట్ల పట్టికలో. దీంతో తుది పోరాటానికి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు పోరాడేందుకు రెడీ అయ్యాయి. ఇక ఫైనల్ మ్యాచ్ ఆడిన అనంతరం లండన్ నుంచే నేరుగా విండీస్ టూర్ కు బయలుదేరి వెళ్లనుంది.
ఇక ఆస్ట్రేలియా జట్టు విషయానికి వస్తే పాట్ కమిన్స్ స్కిప్పర్ కాగా , కామెరాన్, జోష్, స్కాట్, ట్రావిస్ హెడ్, ఇంగ్లిష్, ఉస్మాన్ , సామ్ కరణ్ , మాథ్యూ, లబూషేన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్పార్క్, వెబ్ స్టర్, బ్రెండన్ ఉన్నారు.
Also Read : Tourist Family Sensational Collections :రూ. 51 కోట్లు దాటేసిన టూరిస్ట్ ఫ్యామిలీ కలెక్షన్స్