Akhanda 2 : దమ్మున్న దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న అఖండ -2(Akhanda 2) సీక్వెల్ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే కీలక సన్నివేశాలను ఇటీవలే ఉత్తర ప్రదేశ్ లోని కుంభమేళాలో చిత్రీకరించారు. బాలయ్య, శ్రీను కాంబినేషన్ లో గతంలో తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. కాసుల వర్షం కురిపించాయి. తన దర్శకత్వంలో వచ్చిన అఖండ దుమ్ము రేపింది. బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. దీంతో మూవీ మేకర్స్ అఖండకు సీక్వెల్ తీస్తున్నట్టు ప్రకటించాడు. ఆ వెంటనే రంగంలోకి దిగాడు. ప్రస్తుతం షూటింగ్ జార్జియాలో కొనసాగుతోంది.
Balakrishna – Akhanda 2 Movie Updates
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. దీనికి అఖండ 2 – తాండవం అని పేరు పెట్టాడు దర్శకుడు బోయపాటి శ్రీను. యాక్షన్, ఎంటర్ టైన్, థ్రిల్లర్ గా దీనిని తెరకెక్కిస్తున్నాడు. ప్రధానంగా భావోద్వేగాలను , రౌద్రాన్ని పలికించడంలో తనకు తనే సాటి గా గుర్తింపు పొందారు నందమూరి బాలకృష్ణ. ఇందులో కీ రోల్ పోషించనుంది విజయశాంతి. ఇప్పటికే సంచలన ప్రకటన చేశాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ ఏడాది సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామని వెల్లడించాడు.
దీంతో బాలయ్యతో మూవీ పక్కాగా ప్రేక్షకుల ముందుకు రానుందని తేలి పోయింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అఖండ 2 తాండవంకు సంబంధించిన పోస్టర్స్ కలకలం రేపుతున్నాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మాటల తూటాలు పేలడం ఖాయమని అంటున్నారు సినీ వర్గాలు. ఇదిలా ఉండగా బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ లో ఇప్పటి వరకు వచ్చిన మూడు సినిమాలు హ్యాట్రిక్ విజయాన్ని సాధించాయి. ఇది వీరి కాంబోలో వస్తున్నా నాలుగో చిత్రం కావడం విశేషం.
Also Read : Hero Allu Arjun-Mrunal :ఐకాన్ స్టార్ తో జత కట్టనున్న మృణాల్ ఠాకూర్