టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రూటే వేరు. తను ఎవరి మాట వినడు. తను అనుకున్నది వచ్చేంత వరకు ఊరుకోడు. ప్రస్తుతం తను భారత క్రికెట్ జట్టులో కీలకమైన ఫార్మాట్ లకు వేర్వేరు జట్లను తయారు చేయాలని ప్లాన్ చేశాడు. ఆ దిశగా పావులు కదుపుతున్నాడు. స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ ను రాహుల్ ద్రవిడ్ పక్కన పెడితే గంభీర్ వచ్చాక తనకు ప్రమోషన్ ఇచ్చాడు. దీంతో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు ఈ క్రికెటర్.
ఇక తాజాగా ఇండియా -ఎ జట్టును ప్రకటించింది. ఈనెల 30న ఇంగ్లండ్ లో పర్యటించనుంది. ఇందుకు గాను యంగ్ టాలెంట్ కు ప్రయారిటీ ఇచ్చాడు గంభీర్. ఈ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ నాయకత్వం వహిస్తాడు. చాలా కాలం తర్వాత కరణ్ నాయర్ తిరిగి ఎంపిక కావడం విశేషం. ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, యశస్వి జైస్వాల్ కూడా కీ రోల్స్ పోషించనున్నారు. మొత్తం 18 మందిని ప్రకటించింది సెలెక్షన్ కమిటీ .
ఇంగ్లండ్ టూర్కు భారత ఎ జట్టు ఇలా ఉంది. అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ కాగా యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్ వైస్ కెప్టెన్, వికెట్ కీపర్, నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (డబ్ల్యుకె), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్, హర్షిత్ కమ్ద్రాజ్, హర్షిత్ రణా గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్పాండే, హర్ష్ దూబే ఉన్నారు.