టీమిండియా ఎంపిక‌పై ఉత్కంఠ

కేఎల్ రాహుల్ తో య‌శస్వి జైస్వాల్

ముంబై – ఐపీఎల్ టోర్నీ ముగియ‌నుంది. దీంతో బీసీసీఐ త‌దుప‌రి కీల‌క షెడ్యూల్స్ ను ఖ‌రారు చేసే ప‌నిలో ప‌డింది. ఇటీవ‌లే రోహిత్ శ‌ర్మ తాను టెస్టు ఫార్మాట్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అంతే కాకుండా కెప్టెన్ గా కూడా వైదొల‌గాడు. దీంతో బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ పూర్తి స్థాయిలో జ‌ట్టును ఎంపిక చేసే ప‌నిలో ప‌డింది. ప్ర‌ధానంగా జ‌ట్టు ఇంగ్లండ్ కు వెళ్ల‌నుంది. ఈ టీంలో ఎవ‌రు ఉంటార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

క్రికెట్ వ‌ర్గాల నుంచి వ‌చ్చిన స‌మాచారం మేర‌కు స్టార్ క్రికెట‌ర్ కేఎల్ రాహుల్, య‌శ‌స్వి జైస్వాల్ ఓపెన‌ర్స్ గా వ‌స్తార‌ని , 4వ స్థానంలో శుభ‌మ‌న్ గిల్ రానుండ‌గా 3వ ప్లేస్ లో ఎవ‌రు ఉంటార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. గ‌తంలో టెస్టు మ్యాచ్ ల సంద‌ర్బంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు వ‌చ్చే వారు మైదానంలోకి . విచిత్రం ఏమిటంటే ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ స‌మ‌యంలోనే ఈ ఇద్ద‌రు స్టార్ ప్లేయ‌ర్లు తాము టెస్టు ఫార్మాట్ కు గుడ్ బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. విస్తు పోయేలా చేశారు.

శ‌నివారం జ‌ట్టును ఎంపిక చేస్తుంది బీసీసీఐ. ష‌మీ ఎంపిక అవుతాడా లేదా అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. సాయి సుద‌ర్శ‌ణ్ , క‌రుణ్ నాయ‌ర్ జ‌ట్టులోకి రాబోతున్న‌ట్లు టాక్. ష‌మీ ఫిట్ నెస్ స‌రిగా ఉందా లేదా అనే దానిపై అనుమానం నెల‌కొంది. మొత్తంగా టీం ఎంపిక త‌ల‌కు మించిన భారంగా మారింది సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ కు.

Comments (0)
Add Comment