పెహల్గామ్ దాడి ఘటనలో ఇప్పటికే మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ విజయ్ షా చేసిన కామెంట్స్ కలకలం రేపగా అదే పార్టీకి చెందిన ఎంపీ రామ్ చందర్ జంగ్రా మహిళలను చులకన చేసేలా మాట్లాడటం చర్చనీయంశంగా మారింది. పహల్గం దాడిలో మహిళలకు ధైర్యం లేకనే భర్తలను కోల్పోయారని, శిక్షణ లేకనే పర్యాటకులు చేతులు ముడుచుకొని చనిపోయారని వ్యాఖ్యానించారు.
కల్నల్ సోఫియా ఖురేషి పట్ల బీజేపీ మంత్రి చేసిన వ్యాఖ్యలు మరవకముందే, పహల్గం దాడి గురించి బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మోడీ మొదలుపెట్టిన అగ్నివీర్ పథకంలో శిక్షణ తీసుకొని ఉంటే చనిపోయేవారు కాదని, అక్కడున్న మహిళలకు కొంచెం ధైర్యం ఉన్నా వారి భర్తలను కాపాడుకునే వారని అన్నారు.
సరైన ఆయుధాలు, శిక్షణ లేకనే పర్యాటకులు చేతులు ముడుచుకొని ఉగ్రవాదుల బుల్లెట్లకు తలొంచి మృత్యువాత పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ . వితంతువుల గురించి జాంగ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల మండిపడుతున్నారు బాధిత కుటుంబాలు, వారు తమ భర్తల ప్రాణాల కోసం వేడుకునే బదులు ఉగ్రవాదులపై పోరాడి ఉండాలని సూచించారు. కాగా
ఉగ్రవాద బాధితుల పట్ల సున్నితంగా లేక పోవడంపై రామ్ చందర్ జాంగ్రా వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీసేలా చేశాయి.