అమరావతి – కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కమలం అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పారు. ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. తన అభిప్రాయాలను పంచుకున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రాముఖ్యత తగ్గిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ బలమైన పార్టీలుగా ఉన్నాయన్నారు.
రాబోయే రోజుల్లో తమ పార్టీ పవర్ లోకి పక్కా వస్తుందన్నారు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరడం ఖాయమన్నారు. గతంలో కాంగ్రెస్ లో పీఆర్పీ విలీనమైన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయాల్లో మనుగడ కోసం తీసుకునే నిర్ణయాలు ముందుగా ఊహించలేమని చెప్పారు కేంద్ర మంత్రి.
అమరావతి వేశ్యల రాజధాని అయితే.. జగన్ అంత ఖరీదైన భవనం ఎందుకు నిర్మించుకున్నారంటూ ప్రశ్నించారు. బీజేపీ కోసం నా ఆస్తులు అమ్ముకున్నానని చెప్పారు. ఎంత పెద్ద కార్యక్రమం చేసినా ఏనాడూ డొనేషన్ ఎవరినీ అడగ లేదన్నారు. ఈరోజు సొంత డబ్బులు ఖర్చుపెట్టి రాజకీయం చేసే నాయకులు ఎవరున్నారంటూ అమాయకంగా ప్రశ్నించారు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ. పార్టీ కోసం కష్టపడ్డాను తప్ప పదవుల కోసం ఎప్పుడూ పని చేయలేదన్నారు.
ప్రజాధనం దుర్వినియోగం చేయడమే తప్ప వైజాగ్ లో భవనాలు ఎందుకంటూ ప్రశ్నించారు . ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకే వైసీపీ మూడు రాజధానుల నినాదం ముందుకు తీసుకు వచ్చిందన్నారు కేంద్ర మంత్రి. తన కల్ల బొల్లి మాటలను ప్రజలు నమ్మరన్నారు. అందుకే తన పార్టీకి 11 సీట్లకే పరిమతం చేశారన్నారు.