Buddy: అల్లు శిరీష్‌ ‘బడ్డీ’ సినిమా టిక్కెట్స్ రేట్స్ తగ్గించిన మేకర్స్ !

అల్లు శిరీష్‌ ‘బడ్డీ’ సినిమా టిక్కెట్స్ రేట్స్ తగ్గించిన మేకర్స్ !

Buddy: అల్లు శిరీష్ హీరోగా, గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘బడ్డీ’. ఈ సినిమాను శామ్‌ ఆంటోన్‌ దర్శకత్వంలో తెరకెక్కించారు. అడ్వెంచర్‌ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందించిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న బడ్డీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

Buddy Movie Tickets..

ఈ నేపథ్యంలో బడ్డీ(Buddy) మేకర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీ టికెట్ రేట్లను తగ్గిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.99, మల్టీప్లెక్సుల్లో కేవలం రూ.125 గా నిర్ణయించినట్లు అల్లు శిరీష్‌ ట్వీట్ చేశారు. కుటుంబమంతా బడ్డీని చూసేందుకు మీకు అవకాశం కల్పిస్తున్నాం అంటూ పోస్ట్ చేశారు. దీనితో సినీ ప్రియులు ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే బడ్డీ ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా… ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా… బడ్డీ మూవీ ఆగస్టు 2న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇటీవల కాలంలో ఏ సినిమా రిలీజైనా టిక్కెట్లు రేట్లు పెంచడం మత్రమే చూసిన అభిమానులు బడ్డీ సినిమా టిక్కెట్లు రేట్లు తగ్గించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Bhagyashri Borse: మిస్టర్‌ బచ్చన్‌ టీజర్‌ విడుదల వేడుకలో స్టేజ్‌ పై స్టెప్‌ వేసిన భాగ్యశ్రీ బోర్సే !

Allu SirishBuddy
Comments (0)
Add Comment