రోజు రోజుకు పెరుగుతున్న క‌రోనా కేసులు

ఎలాంటి ఆందోళ‌న చెంద‌వద్దంటూ సూచ‌న

క‌రోనా భూతం మ‌రోసారి జ‌డ‌లు విప్పింది. దీని దెబ్బ‌కు దేశంలో ప‌లు చోట్ల కోవిడ్ పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన స‌మాచారం మేర‌కు 3,395 కేసులు నమోదు కావ‌డం ఒకింత ఆందోళ‌న క‌లిగిస్తోంది. ప్ర‌ధానంగా ఈ కేసులు ఢిల్లీ, కేర‌ళ ప్రాంతాల‌లో ఎక్కువ‌గా న‌మోద‌య్యాయి. కేర‌ళ‌లో ఒకే రోజు 189 కొత్తగా కేసులను గుర్తించారు. 1,336 మంది ఇప్ప‌టి వ‌ర‌కు దీని బారిన ప‌డ్డారు. క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఢిల్లీ, కేర‌ళ రాష్ట్రాలు క‌లిపి 3 వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో లభించే డేటా ప్రకారం దేశంలో 3,395 క్రియాశీల కరోనా వైరస్ కేసులు ఉన్నాయి, గత వారం నుండి 1,200 శాతం పెరుగుదల. మే 22 న భారతదేశం 257 క్రియాశీల కేసులను కలిగి ఉంది. మే 26 నాటికి 1,010కి చేరుకున్నాయి. శుక్ర‌, శ‌నివారాల‌లో కొత్త‌గా 685 కోవిడ్ కేసులు న‌మోదైన‌ట్లు తెలిపింది.

ఇక రాష్ట్రాల వారీగా చూస్తే కేసుల న‌మోదులో కేర‌ళ టాప్ లో ఉంటే 2వ స్థానంలో ఢిల్లీ ఉంది. ఆ త‌ర్వాత మ‌హారాష్ట్ర‌లో 467 కేసులు న‌మోదు కాగా గుజ‌రాత్ లో 265 , క‌ర్ణాట‌క‌లో 234, ప‌శ్చిమ బెంగాల్ లో 205, త‌మిళ‌నాడులో 185, ఉత్త‌ర ప్ర‌దేశ్ లో 117 కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. ఢిల్లీలో ఇప్ప‌టి వ‌ర‌కు 375 కేసులు న‌మోద‌య్యాయి.

Comments (0)
Add Comment