న్యూఢిల్లీ – భారత్, పాక్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రికత్తల నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందం గడువును మే 18 వరకు పొడిగించినట్లు ప్రకటించాయి ఇరు దేశాలు. జమ్మూ కాశ్మీర్ లో భారత భద్రతా దళాలు ఉగ్రవాదుల ఏరివేతపై దృష్టి సారించాయి. గత రెండు రోజుల్లో ఆరుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి. ఇంకా ఎక్కడెక్కడ దాక్కున్నారో జల్లెడ పడుతున్నాయి.
తాజాగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కీలక ప్రకటన చేశారు. ఆయన తమ దేశ ఆర్మీతో సంభాషించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆసియా ఖండంలో శాంతి నెలకొల్పేందుకు భారత్ తో చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. ఇదిలా ఉండగా ఇరు దేశాల డీజీఎంలు హాట్ లైన్ వేదికగా మాట్లాడనున్నారు. సీజ్ ఫైర్ కు సంబంధించి చర్చలు జరపనున్నారు.
సమావేశంలో రెండు దేశాల DGMOలు సరిహద్దు వెంబడి పరిస్థితిని సమీక్షిస్తారు. ఉగ్రవాద ఆందోళనల కారణంగా భారతదేశం సింధు జల ఒప్పందాన్ని నిలుపుదల చేస్తూనే ఉంది.నియంత్రణ రేఖ , సరిహద్దు ప్రాంతాలలో అధిక అప్రమత్తత స్థాయిలను క్రమంగా తగ్గించడానికి భారతదేశం, పాకిస్తాన్ తమ విశ్వాసాన్ని పెంపొందించే చర్యలను కొనసాగించాలని నిర్ణయించిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వచ్చింది.