త్రివిధ దళాల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

రూ. 40 వేల కోట్ల ప్యాకేజీకి గ్రీన్ సిగ్న‌ల్

ఆప‌రేష‌న్ సిందూర్ స‌క్సెస్ తో భార‌త్ లో జోష్ మొద‌లైంది. యావ‌త్ దేశ వ్యాప్తంగా తిరంగా జెండాలు రెప రెప లాడుతున్నాయి. ఈ విజ‌యం పూర్తిగా త్రివిధ ద‌ళాల‌దేన‌ని ప్ర‌క‌టించారు జాతిని ఉద్దేశించి దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. జ‌మ్మూ కాశ్మీర్ లోని పహ‌ల్గ‌గామ్ లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు అత్యంత దారుణంగా 26 మంది ప‌ర్యాట‌కులను చంపేశారు. ఈ సంద‌ర్బంగా భార‌త్ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చింది. అయినా దాయాది దేశ‌వ త‌న తీరు మార్చుకోలేదు. క‌య్యానికి కాలు దువ్వింది.

దీంతో ప్ర‌ధాన‌మంత్రి అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వహించారు. ఏప్రిల్ 22 దాడి ఘ‌ట‌న‌కు ప్ర‌తీకారంగా త్రివిధ ద‌ళాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. దీంతో పాకిస్తాన్ పై విరుచుకుప‌డ్డాయి. పీఓకేలో స్థావ‌రాలు ఏర్పాటు చేసుకున్న ఉగ్ర‌వాదుల‌కు చుక్క‌లు చూపించాయి. త‌రిమి త‌రిమి కొట్టాయి. అంతే కాకుండా పాకిస్తాన్ ఎయిర్ బేస్ ల‌పై దాడుల‌కు దిగ‌బ‌డింది. అంతే కాదు జీవదాయ‌నిగా ఉన్న సింధు న‌దీ జ‌లాల‌ను నిలిపి వేసింది. దీంతో పాకిస్తాన్ దాహార్తితో అల్లాడుతోంది.

గ‌త్యంత‌రం లేక కాళ్ల బేరానికి వ‌చ్చింది. అమెరికా శ‌ర‌ణు కోరింది. చివ‌ర‌కు ట్రంప్ జోక్యంతో మోదీ మెత్త‌బ‌డ్డారు. ప్ర‌స్తుతానికి కాల్పుల విర‌మ‌ణ కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో ఆర్మీ ద‌ళాల‌కు తీపి క‌బురు చెప్పారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ. ఈ మేర‌కు త్రివిధ ద‌ళాల‌ను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు గాను రూ. 40 వేల కోట్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపారు.

Comments (0)
Add Comment