Charu Asopa: విడాకులు తీసుకున్న భర్తతో బాలీవుడ్ బ్యూటీ విహారయాత్ర !

విడాకులు తీసుకున్న భర్తతో బాలీవుడ్ బ్యూటీ విహారయాత్ర !

Charu Asopa: విడాకులు తీసుకున్న భార్యభర్తలు… పిల్లల కోసం లాయర్లు లేదా మధ్యవర్తుల సమక్షంలో కలవడం సర్వసాధారణం. కాని విడాకులు తీసుకున్న తరువాత వారు మళ్ళీ కలిసి విహార యాత్రలు చేయడం మాత్రం ఎవరూ ఊహించరు. అయితే భార్యాభర్తలుగా విడిపోయినా తల్లిదండ్రులుగా కలిసే ఉన్నామంటోందో ఈ బాలీవుడ్‌ మాజీ జంట. కూతురి కంటే ఏదీ ఎక్కువ కాదంటూ సకుటుంబ సపరివారి సమేతంగా విహార యాత్రలు చేస్తున్నారు బాలీవుడ్ బుల్లి తెర నటులు చారు అసోపా(Charu Asopa)… హీరోయిన్‌ సుష్మితా సేన్‌ సోదరుడు రాజీవ్‌ సేన్‌.

Charu Asopa…

బాలీవుడ్ బుల్లి తెర నటి చారు అసోపా… హీరోయిన్‌ సుష్మితా సేన్‌ సోదరుడు రాజీవ్‌ సేన్‌ ను 2019లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2021లో జియానా అనే కూతురు పుట్టింది. ఆ మరుసటి ఏడాది ఇద్దరూ విడిపోయినట్లు ప్రకటించారు. గతేడాది విడాకులు తీసుకున్నారు. అయితే వీరిద్దరూ లీగల్ గా విడిపోయారన్న మాటే కానీ కుటుంబం పరంగా తరచూ కలుసుకుంటూనే ఉంటున్నారు. కూతురితో కలిసి హాలీడే ట్రిప్పులకు కూడా వెళ్తున్నారు. ఈ మధ్యే దుబాయ్‌ కు వెళ్లొచ్చారు. దాని గురించి చారు మాట్లాడుతూ… ‘మా ట్రిప్‌ అద్భుతంగా జరిగింది. జియానా చాలా సంతోషపడిపోయింది. కుటుంబమంతా కలిసి ట్రిప్‌ కు వెళ్లడం ఇదే మొదటిసారి. రాజీవ్‌.. జియానా తండ్రి. అలాంటప్పుడు నా కూతురికి అతడి కుటుంబాన్ని ఎందుకు దూరంగా ఉంచుతాను ? అందుకే అందరం కలిసే వెళ్లాం.

రాజీవ్‌ అమ్మ సుష్మిత అంటే కూడా నాకిష్టం. రాజీవ్‌ తోనూ హ్యాపీగా ఉన్నాను. విడిపోయినంతమాత్రాన మా బంధాలన్నీ తెగిపోయినట్లు కాదు. జియానాను తన కుటుంబానికి దూరంగా ఉంచాలనుకోవడం లేదు. రాజీవ్‌, నేను మంచి ఫ్రెండ్స్‌గా కొనసాగుతున్నాం. జియానా ముందు పాత విషయాలన్నీ మర్చిపోయి స్నేహితులుగా కొనసాగితే అంతకన్నా గొప్ప విషయం ఇంకేముంటుంది?’ అని చెప్పుకొచ్చింది చారు అసోపా. ప్రస్తుతం వీరి దుబాయ్ ట్రిప్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Also Read : Thangalaan: ‘తంగలాన్‌’ విడదలకు ముహూర్తం ఫిక్స్ !

Charu AsopaRajeev SenSushmita Sen
Comments (0)
Add Comment