అహ్మదాబాద్ – ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో ప్లే ఆఫ్స్ కు చేరుకున్న గుజరాత్ టైటాన్స్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ పై గెలుపొంది పాయింట్ల పట్టికలో టాప్ లోకి చేరాలని అనుకున్న శుభ్ మన్ గిల్ ఆశలపై ధోనీసేన నీళ్లు చల్లారు. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ 147 రన్స్ మాత్రమే చేసి చేతులెత్తేసింది. దీంతో 83 పరుగుల భారీ స్కోర్ తో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది సీఎస్కే.
కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయింది చెన్నై. మ్యాచ్ విషయానికి వస్తే బ్రెవిస్ చుక్కలు చూపించాడు గుజరాత్ బౌలర్లకు . 23 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్స్ లతో 57మ రన్స్ చేశాడు. కాన్వే 35 బాల్స్ లో 6 ఫోర్లు 2 సిక్స్ లతో 52 పరుగులు చేసి సత్తా చాటాడు. ఉర్విల్ పటేల్ 19 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్ లతో 37 రన్స్ చేయగా ఆయుష్ మాత్రే 17 బాల్స్ ఎదుర్కొని 3 ఫోర్లు 3 సిక్స్ లతో 34 రన్స్ చేశారు. దీంతో భారీ స్కోర్ నమోదు చేసింది.
బిగ్ టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఏమాత్రం పోటీ ఇవ్వలేక పోయింది. చెన్నై బౌలర్ల ధాటికి 18.3 ఓవర్లలో 147 రన్స్ కే చాప చుట్టేసింది. ఆ జట్టులో సాయి సుదర్శన్ ఒక్కడే 41 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ సూపర్ స్పెల్ వేశాడు. 13 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. జడేజా 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు.