Chiranjeevi : వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం కు చెక్కును అందజేసిన చిరు

విశ్వక్‌సేన్‌ రూ.10 లక్షలు, హాస్యనటుడు అలీ రూ 3 లక్షలు విరాళాన్ని చెక్కు రూపంలో సీఎంకు అందజేశారు...

Chiranjeevi : రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరద బాధితుల సహాయార్ధం మెగాస్టార్ట్‌ చిరంజీవి ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రాకు రూ.50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంట్లో కలిసి సహాయనిధికి రూ. 50 లక్షల విరాళంను చెక్కు రూపంలో అందజేశారు. అలాగే రామ్‌ చరణ్‌తరపున మరో 50 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కూడా తను ప్రకటించిన రూ.10లక్షల విరాళాన్ని రేవంత్‌కు అందజేశారు.

Chiranjeevi Given..

విశ్వక్‌సేన్‌ రూ.10 లక్షలు, హాస్యనటుడు అలీ రూ 3 లక్షలు విరాళాన్ని చెక్కు రూపంలో సీఎంకు అందజేశారు. అమర్ రాజా గ్రూప్ తరపున సీఎం సహాయనిధికి మంత్రి గల్లా అరుణకుమారి రూ.కోటి విరాళం అందజేశారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రకటించిన .రూ.25 లక్షల విరాళం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి విరాళం చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో స్పందించి ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా సీఎం గారు వారిని అభినందించారు.

Also Read : Siddharth-Aditi : హీరో సిద్ధార్థ్ తో ఏడడుగుల బంధంలోకి ఎంటరైన అదితి రావు

ChiranjeeviFloodsTrendingUpdatesViral
Comments (0)
Add Comment