భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక ఖర్చుతో తీస్తున్న మూవీ ఏఏ22. ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీ రోల్ పోషిస్తుండగా తాజాగా హీరోయిన్ గా కన్ ఫర్మ్ చేయటమే కాదు ఏకంగా గ్లింప్స్ కూడా రిలీజ్ చేశాడు తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్. ఒక్కో దర్శకుడిది ఒక్కో టేస్ట్. తను తీసిన ప్రతి మూవీ బ్లాక్ బస్టరే. అందుకే తనపై తనకు విపరీతమైన నమ్మకం. ఆ మధ్యన బిగిల్, మెర్సిల్ తీశాడు. ఈ రెండూ కోలీవుడ్ ను షేక్ చేశాయి. విజయ్ దళపతికి ఓ రేంజ్ లో స్టార్ డమ్ మరింత పెరిగేలా చేశాడు వరల్డ్ వైడ్ గా.
ఇక ఉన్నట్టుండి పుష్ప 2 మూవీలో రికార్డుల మోత మోగించి పాన్ ఇండియా హీరోగా పేరు పొందిన బన్నీతో సన్ పిక్చర్స్ ను ఒప్పించి సినిమా తీసేందుకు రెడీ అయ్యాడు. తనతో పాటు సన్ పిక్చర్స్ అధినేతతో కలిసి తీసిన వీడియోను వదిలాడు. అది రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. తాజాగా బన్నీ సరసన ఎవరు హీరోయిన్ గా నటిస్తారనే దానికి పుల్ స్టాప్ పెట్టాడు.
దీపికా పదుకొనేను ప్రకటించాడు. ఆమె తో కలిసి వీడియోను ఇవాళ రిలీజ్ చేశాడు. ఇది ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మేకింగ్, టేకింగ్ లో తను వెరీ స్పెషల్. అందుకే అల్లు అర్జున్ వెంటనే అట్లీకి ఓకే చెప్పాడు. ఇక ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తోంది. దర్శకుడు, హీరోకి కలిపి రూ. 350 కోట్లు సన్ పిక్చర్స్ ఇస్తోందని . ఒకవేళ అదే గనుక నిజమైతే ఇది మరో రికార్డ్ అవుతుంది.
ఇదిలా ఉండగా దీపికా పదుకొనేను ఈ ప్రాజెక్ట్ను అంగీకరించమని అట్లీ ఎలా ఒప్పించారో చూపించే గ్లింప్స్ను సన్ పిక్చర్స్ విడుదల చేసింది. ఈ సందర్బంగా గ్లింప్స్ ను చూసిన మరో స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు స్పందించింది. దీపికా పదుకొనేను ప్రశంసలతో ముంచెత్తింది. మేకింగ్ అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చింది. తను చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.