Rakshith Shetty: కాపీ రైట్ కేసులో ఢిల్లీ హైకోర్టులో రక్షిత్‌ శెట్టికి చుక్కెదురు !

కాపీ రైట్ కేసులో ఢిల్లీ హైకోర్టులో రక్షిత్‌ శెట్టికి చుక్కెదురు !

Rakshith Shetty: కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టికి ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. కాపీరైట్‌ ఉల్లంఘన కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఢిల్లీ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ మేరకు రూ. 20 లక్షలు డిపాజిట్‌ చేయాలని కోరింది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ‘బ్యాచిలర్‌ పార్టీ’ సినిమాలో తమ పాటలను అనుమతి లేకుండా రక్షిత్‌ శెట్టి కాపీ కొట్టారని MRT మ్యూజిక్‌ లో భాగస్వామిగా ఉన్న నవీన్ కుమార్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కన్నడలో మంచి విజయం అందుకున్న ఈ సినిమాను పరంవా స్టూడియోపై రక్షిత్‌ నిర్మించారు.

Rakshith Shetty Case..

రక్షిత్ శెట్టి తన ‘బ్యాచిలర్ పార్టీ’ సినిమాలో న్యాయ ఎల్లిదే, ఒమ్మే నిన్ను చిత్రాల్లోని పాటలను ఉపయోగించారని MRT మ్యూజిక్‌ సంస్థ ఫిర్యాదు చేసింది. కాపీరైట్ అనుమతులు లేకుండానే ఇలాంటి చర్యలకు పాల్పడిన రక్షిత్‌ శెట్టి(Rakshith Shetty) నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోపై యశ్వంత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారు. అయితే, పై నమోదైన కాపీరైట్‌ చట్టం ఉల్లంఘన కేసులో ఆయనకు కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. తాజాగా ఢిల్లీ కోర్టు దానిని తొసిపుచ్చింది. అంతేకాదు తక్షణమే రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలంటూ రక్షిత్ శెట్టిని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. యూట్యూబ్‌, సోషల్‌ మీడియాలో ఆ పాటలను తొలగించాలని సూచించింది. పలు కారణాల వల్ల రక్షిత్ శెట్టి ఢిల్లీ కోర్టుకు హాజరు కాలేదు.

గతంలో ‘కిరిక్‌ పార్టీ’ సినిమా సమయంలోనూ ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు రక్షిత్‌. 2016 డిసెంబర్‌లో విడుదలైన ఆ సినిమాలోని ‘హే హూ ఆర్‌ యూ’ అనే పాటకు పరంవా స్టూడియోస్‌ కాపీరైట్‌ ఉల్లంఘనకు పాల్పడిందని లహరి మ్యూజిక్‌ డైరెక్టర్‌ లహరి వేలు ఆరోపించారు. అప్పుడు సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు కోర్టు స్టే విధించింది.

Also Read : Yuvan Shankar Raja: ఇంటి అద్దె చెల్లించలేదని యువన్‌ శంకర్‌ రాజాపై ఫిర్యాదు !

Copy Right ActDelhi High CourtRakshith Shetty
Comments (0)
Add Comment