Dhanush: నడిగర్‌ సంఘం భవన నిర్మాణానికి రూ.కోటి విరాళమిచ్చిన ధనుష్‌ !

నడిగర్‌ సంఘం భవన నిర్మాణానికి రూ.కోటి విరాళమిచ్చిన ధనుష్‌ !

Dhanush: కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ మరోసారి తన ధాతృత్వాన్ని చాటుకున్నారు. ‘సౌత్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ (నడిగర్ సంఘం) నూతన భవన నిర్మాణం కోసం రూ. కోటి విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్‌ ను నడిగర్ సంఘం అధ్యక్షులు నాజర్‌, కోశాధికారి కార్తీ కు అందించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ‘సౌత్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పింది.

Dhanush Donated

నటుడు నాజర్‌ అధ్యక్షుడిగా, విశాల్ ప్రధాన కార్యదర్శిగా, కార్తి కోశాధికారిగా నడిగర్‌ సంఘానికి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సంఘం నూతన భవన నిర్మాణం కోసం ఇప్పటికే పలువురు ప్రముఖులు విరాళం అందచేశారు. అగ్ర కథానాయకులు కమల్‌ హాసన్‌, విజయ్‌ లు గతంలో దీని కోసం రూ.కోటి విరాళంగా ఇచ్చారు. అలాగే హీరో శివ కార్తికేయన్‌ రూ. 50లక్షలు అందించారు. ప్రస్తుతం నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటిని దీన్ని ప్రారంభించనున్నారు.

ఇక ధనుష్(Dhanush) సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న కుబేర సినిమాలో నటిస్తున్నారు. నాగార్జున, ధనుష్‌ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌. ఇందులో ధనుష్‌ డీగ్లామరైజ్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలోని సన్నివేశాలు సహజంగా రావడం కోసం ఆయన 10 గంటల సేపు మాస్క్‌ కూడా లేకుండా డంప్‌యార్డ్‌లో నటించారు. దీనితో పాటు ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో ‘రాయన్‌’లో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమాకి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందిస్తున్నారు.

Also Read : Singer Suchitra: తన మాజీ భర్త గే అన్న సుచిత్ర ! సుచిత్ర వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మాజీ భర్త !

dhanushkarthi
Comments (0)
Add Comment