అక్కినేని నాగార్జున, ధనుష్ కలిసి నటించిన చిత్రం కుబేర. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా నటించింది. ఈ సందర్బంగా తన మనసులోని మాటలను పంచుకున్నారు చిట్ చాట్ సందర్బంగా దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈనెల 20న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎలాగైనా సరే కుబేర తప్పకుండా ఆడుతుందని, ప్రేక్షకుల మనసు దోచుకుంటుందన్నారు కమ్ముల.
ఇలాంటి కథతో కూడిన సినిమాను చూసి ఉండరని పేర్కొన్నారు. భిన్నమైన అనుభవాన్ని తప్పకుండా ఇస్తుందన్నారు. భారతీయ సినిమాలో తప్పకుండా గేమ్ ఛేంజర్ కాబోతోందన్నారు. విచిత్రం ఏమిటంటే ఇప్పటి వరకు చిన్న నటులతో మూవీస్ తీశారు శేఖర్ కమ్ముల. ఈసారి బిగ్ స్టార్స్ తో మూవీ తీయడం విశేషం. ఇప్పటి వరకు కుబేరకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ మంచి ఆదరణ లభించింది. దీంతో మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ముందస్తు టికెట్స్ కూడా భారీగా అమ్ముడు పోయాయి. మొత్తంగా పాజిటివ్ టాక్ రావడంతో హ్యాపీగా ఉన్నారు.
ఇక రష్మిక మందన్నకు ఈ ఏడాదిలో చావా బిగ్ సక్సెస్ కాగా సికిందర్ అట్టర్ ప్లాప్ గా నిలిచింది. ఇక తను కూడా కుబేర పైనే ఆశలు పెట్టుకుంది. తను ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్లలో టాప్ లో ఉంది. ప్రస్తుతం తను విజయ్ దేవరకొండతో డేటింగ్ లో ఉంది.
ఇక కుబేర చిత్రాన్ని శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. కుబేర మూవీ పూర్తిగా బిలియనీర్స్ వర్సెస్ బెగ్గర్స్ మధ్య నడిచే కథే ఈ చిత్రం అన్నారు దర్శకుడు. తనకు ఏమీ వద్దని అనుకునే యాకుడు..ప్రపంచంలోని ప్రతీది కావాలని అనుకునే ధనవంతుడి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంటే ఎలా ఉంటుందనే పాయింట్ తో తీశానని చెప్పాడు.