Ex Minister Roja : అమరావతి – మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై భగ్గుమన్నారు. ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, పూర్తిగా గాడి తప్పిందంటూ ధ్వజమెత్తారు. అమలు కాని హామీలు ఇచ్చి పవర్ లోకి వచ్చిన కూటమి సర్కార్ ఏ ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేసిన పాపాన పోలేదన్నారు.
Ex Minister Roja Shocking Comments
వ్యవస్థలను అన్నింటిని నిర్వీర్యం చేశారని, ఇప్పుడు కేవలం నారా వారి పాలనే కొనసాగుతోందని సంచలన ఆరోపణలు చేశారు ఆర్కే రోజా సెల్వమణి(Ex Minister Roja). కేవలం ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడం, అక్రమ కేసులు బనాయించడం తప్పితే చేసింది ఏమీ లేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఏదో ఒక రోజు బాబు పాలనకు చరమ గీతం పాడక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. విద్యను వ్యాపారం చేశారని, ఆరోగ్యం అటకెక్కిందని, పేదల పాలిట సర్కార్ శాపంగా మారిందని వాపోయారు ఆర్కే రోజా సెల్వమణి. ఎన్ని కేసులు బనాయించినా తట్టుకుని నిలబడే శక్తి, దమ్ము తమకు ఉందన్నారు. ఇకనైనా ప్రజలకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు సర్కార్ కు.
Also Read : Pakistan Shocking :భారత దౌత్యవేత్తను బహిష్కరించిన పాకిస్తాన్
Ex Minister Roja Shocking :ఏపీలో గాడి తప్పిన కూటమి పాలన
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి రోజా
Ex Minister Roja : అమరావతి – మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై భగ్గుమన్నారు. ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, పూర్తిగా గాడి తప్పిందంటూ ధ్వజమెత్తారు. అమలు కాని హామీలు ఇచ్చి పవర్ లోకి వచ్చిన కూటమి సర్కార్ ఏ ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేసిన పాపాన పోలేదన్నారు.
Ex Minister Roja Shocking Comments
వ్యవస్థలను అన్నింటిని నిర్వీర్యం చేశారని, ఇప్పుడు కేవలం నారా వారి పాలనే కొనసాగుతోందని సంచలన ఆరోపణలు చేశారు ఆర్కే రోజా సెల్వమణి(Ex Minister Roja). కేవలం ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడం, అక్రమ కేసులు బనాయించడం తప్పితే చేసింది ఏమీ లేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఏదో ఒక రోజు బాబు పాలనకు చరమ గీతం పాడక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. విద్యను వ్యాపారం చేశారని, ఆరోగ్యం అటకెక్కిందని, పేదల పాలిట సర్కార్ శాపంగా మారిందని వాపోయారు ఆర్కే రోజా సెల్వమణి. ఎన్ని కేసులు బనాయించినా తట్టుకుని నిలబడే శక్తి, దమ్ము తమకు ఉందన్నారు. ఇకనైనా ప్రజలకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు సర్కార్ కు.
Also Read : Pakistan Shocking :భారత దౌత్యవేత్తను బహిష్కరించిన పాకిస్తాన్