నాంప‌ల్లి కోర్టుకు ప్ర‌భాక‌ర్ రావు హాజ‌రు

అస‌లు ఎందుకు వెళుతున్నారు..ఏమిటా క‌థ‌

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క‌మైన నిందితుడిగా తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు సీఐబీ మాజీ చీఫ్ ప్ర‌భాక‌ర్ రావు. గ‌తంలో కొలువు తీరిన బీఆర్ఎస్ కేసీఆర్ స‌ర్కార్ హ‌యాంలో మ‌నోడు చ‌క్రం తిప్పాడు. ఊహించ‌ని రీతిలో త‌న‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది. గులాబీ ప్ర‌భుత్వం కూలి పోయింది. ప్ర‌జా పాల‌న పేరుతో రేవంత్ రెడ్డి స‌ర్కార్ కొలువు తీరింది. ఆ వెంట‌నే ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంపై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో త‌న‌కు నోటీసులు ఇచ్చారు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని. త‌ను ప్ర‌భుత్వం మారిన వెంట‌నే ప్ర‌భాక‌ర్ రావు జంప్ అయ్యాడు. అమెరికాకు చెక్కేశాడు. అక్క‌డి నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశాడు. దీనిని ముందే గ‌మ‌నించిన సిట్ త‌న‌ను అరెస్ట్ చేసేందుకు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు. ఆపై స్పందించ‌క పోవ‌డంతో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

దీనిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఈ మేర‌కు విచార‌ణకు హాజ‌రు కావాల‌ని లేక పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు. జైలుకు వెళ్లాల్సి వ‌స్తుంద‌ని చెప్ప‌డంతో ప్ర‌భాక‌ర్ రావు గ‌త్యంత‌రం లేక సిట్ ముందు హాజ‌ర‌య్యారు. కోర్టు ప‌రంగా 30 రోజులు బ‌య‌ట ఉంటే త‌ప్ప‌కుండా కోర్టుకు హాజ‌రు కావాల్సి ఉంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగుసార్లు సిట్ ముందు హాజ‌ర‌య్యారు. శుక్ర‌వారం నాంపల్లి కోర్టు ముందుకు వ‌చ్చారు.

Comments (0)
Add Comment