మునీర్ కు అంద‌లం ఇమ్రాన్ ఖాన్ ఆగ్ర‌హం

దొంగ‌కు ప‌దోన్న‌తి క‌ల్పిస్తే ఎలా అని మండిపాటు

పాకిస్తాన్ – మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్ ఖాన్ నిప్పులు చెరిగారు. ఆయ‌న జైలు లో నుంచే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కు ప‌దోన్న‌తి క‌ల్పించ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏం చేశార‌ని, ఏం ఒర‌గ బెట్టార‌ని త‌న‌కు ప్ర‌మోష‌న్ ఇచ్చారంటూ ప్ర‌ధాన‌మంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్ ను ప్ర‌శ్నించారు. దీనిని ప్ర‌జ‌లు హ‌ర్షించ‌ర‌ని పేర్కొన్నారు. ఓ వైపు భార‌త్ నిప్పులు చెరుగుతుంటే ఇంకో వైపు చూస్తూ ఊరుకుంటే ఎలా అని నిల‌దీశారు ఇమ్రాన్ ఖాన్.

ఈ నిర్ణ‌యం పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. దీనిని తాను పూర్తిగా ఖండిస్తున్నాన‌ని, త‌మ పార్టీ ఆందోళ‌న చేప‌డుతుంద‌ని ప్ర‌క‌టించారు. దేశ చ‌రిత్ర‌లో ఈ ప‌ద‌వికి ఎదిగిన రెండో అత్యున్న‌త సైనికాధికారిగా మార‌డం దేనికి సంకేతం అని అన్నారు ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ ప్ర‌స్తుతం డెమోక్ర‌సీని పాత‌రేసింద‌ని, అది ఆట‌విక పాల‌న సాగిస్తోంద‌ని ఆరోపించారు. ప్ర‌జ‌లు స్వేచ్ఛ‌ను కోరుకుంటున్నార‌ని అన్నారు.

మాషా అల్లాహ్, జనరల్ అసిమ్ మునీర్‌ను ఫీల్డ్ మార్షల్‌గా నియమించారు. నిజం చెప్పాలంటే, అతనికి బదులుగా ‘రాజు’ అనే బిరుదు ఇవ్వడం మరింత సముచితంగా ఉండేదన్నారు. ఎందుకంటే ప్రస్తుతం, దేశం అడవి చట్టం ద్వారా పాలించ బడుతోంద‌న్నారు. ఇదిలా ఉండ‌గా పాకిస్తాన్ ఆర్మీతో తాను ఒప్పందం చేసుకున్న‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారం పూర్తిగా అబ‌ద్ద‌మ‌న్నాడు.

Comments (0)
Add Comment