టాలీవుడ్ నుంచి కీలక ప్రకటన వచ్చేసింది. వచ్చే ఆగస్టు 30న దుబాయ్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకమైన గల్ఫ్ మూవీ అవార్డ్స్ (జీఏఎంఏ) కార్యక్రమం జరగనుంది. ఈ ఏడాది 2025లో 5వ ఎడిషన్ వేడుకులకు సంబంధించి తాజాగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. వీటిని షార్జా ఎక్స్ పో సెంటర్ లో నిర్వహించనున్నారు. దుబాయ్ వేదికగా లాంచ్ ఈవెంట్ జరిగింది. ప్రత్యేకంగా థీమ్ సాంగ్ ను రాశారు ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్. తను ఆస్కార్ అవార్డు స్వంతం చేసుకున్నాడు. రఘు కుంచె స్వర కల్పన చేయడంతో పాడాడు కూడా.
ఇదిలా ఉండగా ఆరోజు జరిగే టాలీవుడ్ అవార్డులతో పాటు ఆగస్టు 29న ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. ప్రముఖ హీరోలు సిద్దు జొన్నలగ్డ, కిరణ్ అబ్బవరం, వెన్నెల కిషోర్ , తేజ సజ్జా, శ్రీ విష్ణుతో పాటు హీరోయిన్లు దక్ష నాగర్కర్, మీనాక్షి చౌదరి , ఊర్వశి రౌతేలా, కేతిక శర్మ, ఫరియా అబ్దుల్లా, ప్రియా హెగ్డే, శ్రీదేవి, తదితరులు ప్రత్యేక అలరించనున్నారు.
ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం, దర్శకులు సుకుమార్, బుచ్చిబాబు సన, బాబీ, సాయి రాజశ్, సంగీత దర్శకులు ఎస్ఎస్ థమన్, దేవిశ్రీ ప్రసాద్, నిర్మాతలు డీవీవీ దానయ్య, అశ్వని దత్, గీత రచయిత చంద్రబోస్ పాల్గొంటారు. జీఏఎంఏ అవార్డులు టాలీవుడ్ లోని 24 మంది కళాకారులను సత్కరిస్తారు. 2024లో రిలీజ్ అయిన చిత్రాలకు వివిధ విభాగాలలో నామినేటెడ్ అయిన విజేతలను పబ్లిక్ ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేయనున్నారు.