Gautam Gambhir : హైదరాబాద్ – భారత క్రికెట్ జట్టుకు విశిష్ట సేవలు అందించిన టాప్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తామిద్దరూ టెస్టు క్రికెట్ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఎప్పుడైతే టీమిండియాకు హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ వచ్చాడో వీరి ఆడుతారా లేదా అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రాహుల్ ద్రవిడ్ తప్పుకున్నాక తన స్థానంలో వచ్చిన గంభీర్(Gautam Gambhir) కీలక ప్రయోగాలకు తెర తీశాడు. ఒక్కో ఫార్మాట్ కు ఒక్కో జట్టును తయారు చేశాడు.
Gautam Gambhir Shocking Decision
యంగ్ క్రికెటర్లకు ఛాన్స్ లు ఇవ్వడం మొదలు పెట్టాడు. ప్రత్యర్థులు ఎవరైనా సరే దంచి కొట్టే ఆటగాళ్లు కావాలని స్పష్టం చేశాడు. దీంతో సీనియర్లకు ఇబ్బందిగా మారింది గంభీర్ తీరు. విరాట్ కోహ్లీ తను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాక కెప్టెన్ గా కొలువు తీరిన రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు పలు విజయాలు సాధించింది. ఈ తరుణంలో ఉన్నట్టుండి బై చెప్పడంతో ఖాళీ అయిన కెప్టెన్ స్థానంలో ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలి పోయింది.
ప్రస్తుతం టాప్ లో ఆ నలుగురు ఆటగాళ్లు రేసులో ఉన్నారు. వారిలో ఆల్ రౌండర్ , ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టుకు నాయకుడిగా ఉన్న హార్దిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్ స్కిప్పర్ శుభ్ మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ , కేఎల్ రాహుల్ తో పాటు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్ రేసులో ఉన్నారు. వీరిలో ఎవరికి గంభీర్ ఛాయిస్ ఇస్తాడో వేచి చూడాలి.
Also Read : Virat Kohli Assets Sensational :విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ రూ. 1000 కోట్లు