Gautham Gambhir : ముంబై – భారత క్రికెట్ జట్టు సెలెక్టర్లకు టీమిండియా టెస్టు జట్టు స్కిప్పర్ ను ఎంపిక చేయడం తలకు మించిన భారంగా మారనుంది. ఇది కాదనలేని సత్యం. ఇప్పటి దాకా టాప్ పోస్టును తన భుజాల మీద మోసిన ముంబై స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ తాను ఇక ఆడలేనంటూ తప్పుకున్నాడు. నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు. తనతో పాటు రన్ మెషీన్ విరాట్ కోహ్లీ కూడా గుడ్ బై చెప్పాడు. దీంతో రోహిత్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై చర్చ జరుగుతోంది.
Gautham Gambhir…
ఈ తరుణంలో పలువురు క్రికెటర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో ముందుగా ముంబైకి చెందిన హార్దిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్ స్కిప్పర్ శుభ్ మన్ గిల్, లక్నో జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ , బుమ్రా, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ నాయకుడు శ్రేయస్ అయ్యర్ పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ తరుణంలో జట్టు నాయకత్వం ఎంపిక విషయంలో కీలక పాత్ర టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్(Gautham Gambhir) ది. తను ఎవరిని ఎంపిక చేస్తాడనేది ఉత్కంఠ రేపుతోంది.
భారత జట్టుకు సంబంధించి మూడు ఫార్మాట్ లకు వేర్వేరుగా జట్లతో పాటు స్కిప్పర్, వైస్ కెప్టెన్లను ఎంపిక చేయాలని నిర్ణయించాడు గంభీర్. ఇక పంత్ తో పాటు అయ్యర్ ను పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయ్యర్ ను ఎక్కువగా ప్రోత్సహించాడ హెడ్ కోచ్. తాను కోచ్ గా ఉన్న కేకేఆర్ కు అయ్యర్ స్కిప్పర్ గా ఉన్నాడు. ఆ జట్టుకు కప్ ను తీసుకు వచ్చాడు. ఇదే సమయంలో తాజాగా పంజాబ్ కింగ్స్ జట్టును ప్లే ఆఫ్స్ రేసులోకి తీసుకు వెళ్లాడు. తన నాయకత్వ పటిమ ప్రతి ఒక్కరిని విస్తు పోయేలా చేసింది.
Also Read : KL Rahul Sensational :స్కిప్పర్ రేసులో కేఎల్ రాహుల్