Gunturu Kaaram : త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మూవీపై ఫోక‌స్

గుంటూరు కారం షూటింగ్ లో శ్రీ‌లీల‌

Gunturu Kaaram : ప్రిన్స్ మ‌హేష్ బాబు, శ్రీ‌లీల జంట‌గా నటిస్తున్న గుంటూరు కారంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే షూటింగ్ కొన‌సాగుతోంది. తాజాగా న‌టి శ్రీ‌లీల న‌టిస్తుండ‌గా సెప్టెంబ‌ర్ 1న ప్రిన్స్ మ‌హేష్ బాబు జాయిన్ కానున్న‌ట్లు స‌మాచారం.

Gunturu Kaaram Updates

మాట‌ల మాంత్రికుడు, దిగ్గ‌జ ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ గుంటూరు కారం(Gunturu Karam) చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దీంతో ఈ మూవీపై కొండంత భ‌రోసాతో ఉన్నారు. కార‌ణం త్రివిక్ర‌మ్ , మ‌హేష్ బాబు కాంబినేష‌న్ తో ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సినిమాలు పూర్తి చేశారు. అవి బిగ్ సక్సెస్ అయ్యాయి. ప్ర‌స్తుతం మూడో సినిమా గుంటూరు కారం చేస్తున్నారు.

ప్రిన్స్ మ‌హేష్ బాబు కెరీర్ ను మార్చేసిన చిత్రం అత‌డు. దీనికి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అత‌డిలో మాస్ ఎలిమెంట్ ను గుర్తించి ప‌రిచ‌యం చేశాడు. అది సెన్సేష‌న్ మూవీగా నిలిచింది. ఇప్ప‌టికీ అత‌డు సినిమా ఏదో ఒక ఛాన‌ల్ లో ప్ర‌సారం అవుతూనే ఉంటుంది.

త‌ర్వాత ఖ‌లేజా తీశాడు మ‌హేష్ బాబు, అనుష్క శెట్టితో. ఇక గుంటూరు కారంలో మొద‌ట పూజా హెగ్డేతో అనుకున్నారు. డేట్స్ కుద‌ర‌క ఆమె త‌ప్పుకుంది. ప్ర‌స్తుతం ల‌వ్లీ గ‌ర్ల్ శ్రీ‌లీల‌తో సినిమాను కంటిన్యూ చేస్తున్నాడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. ఈ సినిమాపై పెద్ద ఎత్తున నెగ‌టివ్ ప్ర‌చారం జ‌రిగింది. కానీ వ‌చ్చే ఏడాది సంక్రాంతి రోజున గుంటూరు కారం విడుద‌ల అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు మ‌హేష్ బాబు.

Also Read : Indian-2 Movie : ఇండియ‌న్ -2పై ఉత్కంఠ‌

giunturu kaaram mahesh babu sree leela movie shooting
Comments (0)
Add Comment