ఈసారి జరిగిన ఐపీఎల్ 2025 మాకు పీడకలగా మిగిలింది. మేం టైటిల్ హాట్ ఫెవరేట్ గా ఉన్నాం. కానీ ఆశించిన స్థాయిలో ఆడలేక పోయాం. కానీ చివరి మ్యాచ్ లలో మేం ఏమిటో నిరూపించుకున్నాం. ఆట అన్నాక, టోర్నీ అన్నాక ఏదో ఒక జట్టు గెలుస్తుంది. ఇంకో జట్టు ఓడి పోతుంది. ఇవన్నీ మామూలేనని పేర్కొన్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్. ఐపీఎల్ లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో భారీ తేడాతో ఎస్ ఆర్ హెచ్ విజయం సాధించింది. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 278 పరుగులు చేసింది.
ఇందులో హెన్రిచ్ క్లాసెన్ షాన్ దార్ ఇన్నింగ్ ఆడాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. కోల్ కతా బౌలర్ల భరతం పట్టాడు. స్టేడియం చుట్టూ సూపర్ షాట్స్ తో తుక్కు లేపాడు. దీంతో కోల్ కతా బౌలర్లు తన ఆట ధాటికి నేలచూపులు చూశారు. ఎలా తనను ఔట్ చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. క్లాసెన్ ఎదుర్కొన్న బంతులు కేవలం 39 మాత్రమే. ఇందులో 7 ఫోర్లు 9 సిక్సర్లు ఉన్నాయి. అంటే ఫోర్లు, సిక్సర్లతో కలిపి 105 రన్స్ లలో 82 పరుగులు పిండుకున్నాడు. అంటే తను ఎంత ధాటిగా ఆడాడో అర్థం అవుతుంది.
మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు క్లాసెన్. జట్టు విజయంలో అద్భుతమైన పాత్ర పోషించిన హెన్రిచ్ కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింద.ఇ ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడాడు. తను ఆటను ఆస్వాదిస్తానని, అయితే తమ లాంటి ఆటగాళ్లపై యాజమాన్యం భారీగా ఖర్చు పెట్టిందన్నాడు. ఆ మాత్రం తాము ఆడలేక పోతే ఎలా అని ప్రశ్నించాడు. తను చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.