Kashish Chaudhary : బలూచిస్తాన్ లో హిందూ మహిళ ఉన్నతమైన పదవిని అలంకరించారు. అరుదైన ఘనతను సాధించారు . తొలి హిందూ మహిళా అసిస్టెంట్ కమిషనర్ గా కాశీష్ చౌదరి(Kashish Chaudhary) కొలువు తీరారు. నుష్కి ప్రాంతానికి చెందిన ఆమె వయసు కేవలం 25 ఏళ్లు మాత్రమే. బలూచిస్తాన్లో ప్రావిన్షియల్ సివిల్ సర్వీసెస్ (PCS) పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. అందరిని విస్తు పోయేలా చేసింది. ఆమె అసిస్టెంట్ కమిషనర్గా గౌరవనీయమైన స్థానాన్ని పొందిన మొదటి హిందూ మహిళగా చరిత్ర సృష్టించడం విశేషం. ఆమె సాధించిన విజయం అంకిత భావం, పట్టుదలకు నిదర్శనమని చెప్పక తప్పదు.
Kashish Chaudhary got Sensational Position
ఈ సందర్బంగా కాశీష్ చౌదరి మీడియాతో మాట్లాడారు. ఈ స్థాయికి చేరుకునేందుకు మూడేళ్ల పాటు శ్రమించానని చెప్పింది. రోజుకు 8 గంటలకు పైగా కష్టపడి చదివానని అన్నారు. క్రమశిక్షణ, ప్రజల పట్ల ప్రేమ, సేవ చేయాలన్న తలంపే తనను ఉత్తీర్ణత సాధించేలా చేసిందని చెప్పింది.
కాగా కాశీష్ చౌదరి సాధించిన విజయం కేవలం వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు. బలూచిస్తాన్లోని మహిళలు, అణగారిన వర్గాలకు ఆశాకిరణం కూడా. కాశీష్ తన ప్రాంత అభివృద్ధిపై గణనీయమైన ప్రభావాన్ని చూపడం, అవసరంలో ఉన్నవారి జీవితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ విజయం ఈ ప్రాంతంలోని లింగ సమానత్వం, మైనారిటీ వర్గాల సాధికారత కోసం ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది, ఇది చాలా మంది యువత తమ కలలను కొనసాగించడానికి ప్రేరణనిస్తుందని చెప్పక తప్పదు.
Also Read : WTC 2025 Final :డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కు ఆసిస్ జట్టు