ఆక‌స్మిక త‌నిఖీ చేసిన హోం మంత్రి

హోం శాఖ ఫైళ్ల‌ను పూర్తి చేయాలి

అమ‌రావ‌తి – ఏపీ హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత దూకుడు పెంచారు. గురువారం వెలగపూడి సచివాలయంలోని త‌న‌ ఛాంబర్ లో ప్రజలను కలిసి వారి గ్రీవెన్స్ స్వీకరించారు. అనంతరం 2వ బ్లాక్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న హోంశాఖ కార్యాలయాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ , స్పెషల్ సెక్రటరీ విజయ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. సెక్షన్ లోని ఫైళ్ల పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా హోం శాఖ కు సంబంధించి వ‌చ్చే ఫైళ్ల‌ను త్వ‌రిత గ‌తిన పూర్తి చేయాల‌ని ఆదేశించారు వంగ‌ల‌పూడి అనిత‌.

ఎప్ప‌టిక‌ప్పుడు వ‌చ్చే పైళ్ల వివ‌రాలు పూర్తిగా న‌మోదు చేయాల‌ని, అప్ డేట్స్ ఉండ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసుకునేందుకు మ‌రింత సులువు అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం గ్రీవెన్స్ సెల్ కు వ‌స్తుంటార‌ని వారికి స‌రైన స‌దుపాయాలు కూడా క‌ల్పించాల‌ని ఆదేశించారు వంగ‌ల‌పూడి అనిత‌. త‌మ ప్ర‌భుత్వం పూర్తిగా లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ పెట్టేందుకు కృషి చేస్తోంద‌ని చెప్పారు.

విధుల ప‌ట్ల అంకిత భావంతో ప‌ని చేస్తున్న వారిని ఆమె అభినందించారు. ఇదే స‌మ‌యంలో నిర్ల‌క్ష్యంగా వ‌హిస్తే స‌హించేది లేద‌న్నారు. బాధితుల‌కు సాధ్య‌మైనంత మేర‌కు స‌మ‌స్య‌లు వారి ప్రాంతాల్లోనే ప‌రిష్కారం అయ్యేలా చూడాల‌ని స్పష్టం చేశారు హొం శాఖ మంత్రి.

Comments (0)
Add Comment