గెలిచే జ‌ట్టుకే నా మ‌ద్ద‌తు – సెహ్వాగ్

షాకింగ్ కామెంట్స్ చేసిన మాజీ ప్లేయ‌ర్

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ , కామెంటేట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగ‌ళ‌వారం గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ మోదీ స్టేడియం వేదిక‌గా 18వ ఐపీఎల్ 2025 సీజ‌న్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇందులో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ జ‌ట్లు తొలిసారిగా త‌ల‌ప‌డేందుకు సిద్ద‌మ‌య్యాయి.

ఇప్ప‌టికే స్టేడియం మొత్తం నిండి పోయేందుకు టికెట్లు అమ్ముడు పోయాయి. ఫైన‌ల్ మ్యాచ్ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది బీసీసీఐ. క‌ప్ ను ఏ జ‌ట్టు గెలుస్తుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఎవ‌రికి వారు త‌మ త‌మ అభిప్రాయాల‌ను పంచుకుంటున్నారు. క్రికెట్ విశ్లేష‌కులు, విమ‌ర్శ‌కులు, మాజీ క్రికెట‌ర్లు సైతం ఆయా జ‌ట్ల బ‌లా బ‌లాల‌ను అంచ‌నా వేస్తున్నారు.

ఈ సంద‌ర్బంగా మీడియాతో త‌న మ‌న‌సులోని మాట‌ను పంచుకున్నాడు వీరేంద్ర సెహ్వాగ్. ఫైన‌ల్ మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా సాగ‌నుందని, ఇందులో ఏదో ఒక జ‌ట్టు గెల‌వ‌డం ప‌క్కా అన్నాడు. అయితే చాలా తెలివిగా ఆన్స‌ర్ ఇచ్చాడు. త‌న ఫెవ‌రేట్ టీం మాత్రం ఆర్సీబీనేని పేర్కొన్నాడు. తాను ఏ జ‌ట్టునైతే గెలుస్తుంద‌ని గ‌తంలో చెప్పానో ఆ జ‌ట్టు క‌ప్ గెల‌వ‌లేద‌ని చెప్పాడు వీరేంద్ర సెహ్వాగ్.

ఇదిలా ఉండ‌గా ఐపీఎల్ టోర్నీలో 2009, 2011, 2016 త‌ర్వాత 2025లో ఫైన‌ల్ కు చేరుకుంది రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు. మ‌రి ఆ జ‌ట్టు గెలుస్తుందా లేక పంజాబ్ స‌త్తా చాటి క‌ప్ ఎగ‌రేసుకు పోతుందా అనేది వేచి చూడాలి.

Comments (0)
Add Comment