అమెరికా – డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా కొలువు తీరాక అమెరికాలో భారతీయ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ ఇండియన్ స్టూడెంట్ ను అత్యంత కిరాతకంగా దాడి చేశారు న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ లో. చేతులకు సంకెళ్లు వేసి, తలను నేలకు అదిమిపట్టి విద్యార్థిని తీవ్రంగా కొట్టారు. వలసదారుల తరలింపులో భాగంగా విద్యార్థిని బలవంతంగా పంపే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కునాల్ జైన్ అనే సోషల్ ఆంత్రపెన్యూర్ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ను ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఇలాంటి ఘటనలు ఈ మధ్యన ఎక్కువగా కొనసాగుతూ వస్తున్నాయి. అమెరికా సర్కార్, పోలీసులు అనుసరిస్తున్న తీరు పట్ల యావత్ ప్రపంచం నిరసన వ్యక్తం చేస్తోంది. ప్రధానంగా ఎక్కువగా యుఎస్ లో చదువుకునేందుకు వెళ్లే వారు భారతీయ విద్యార్థులతో పాటు చైనా, ఇతర దేశాలకు చెందిన వారున్నారు. విద్యార్థి పట్ల అనుసరిస్తున్న ఈ అమానవీయ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇండియన్, అమెరికన్ కునాల్ జైన్.
ఈ సంఘటనను పరిశీలించి విద్యార్థికి సహాయం చేయాలని జైన్ అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని కోరారు. నిన్న రాత్రి న్యూవార్క్ విమానాశ్రయం నుండి ఒక యువ భారతీయ విద్యార్థిని బహిష్కరించడాన్ని నేను చూశాను— చేతికి సంకెళ్లు వేసి, ఏడుస్తూ, నేరస్థుడిలా వ్యవహరించడం అని పేర్కొన్నాడు. దీనిని ఆయన మానసిక విషాదంగా పేర్కొన్నాడు. పోర్ట్ అథారిటీ పోలీస్ అని రాసి ఉన్న టోపీ ధరించిన పోలీస్ అధికారిని చూపించింది.