INDW vs SLW : మహిళల ట్రై సీరీస్ ను స్వంతం చేసుకుంది భారత మహిళా టీం. ఆదివారం శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సత్తా చాటింది. ఏకంగా 97 పరుగుల భారీ తేడాతో ఓడించింది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ పరంగా సమిష్టి కృషితో రాణించింది. మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసింది టీమ్ ఇండియా(India). ఏకంగా భారీ స్కోర్ ను ముందు ఉంచింది శ్రీలంకకు. నిర్ణీత 50 ఓవర్లలో 343 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ స్మృతీ మంధాన సూపర్ షో చేసింది. ఏకంగా సెంచరీతో దంచి కొట్టింది. లంక బౌలర్లకు చుక్కలు చూపించింది.
INDW vs SLW Sensational
15 ఫోర్లు 2 సిక్స్ లతో 116 పరుగులు చేసింది. ఆమెతో పాటు హర్లీన్ డియోల్ 47 రన్స్ చేయగా, హర్మన్ ప్రీత్ కౌర్ 41 పరుగులు, జెమిమా రోడ్రిగ్స్ 44 , ప్రతీకా ధావల్ 30 రన్స్ చేసి రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో మైదానంలోకి దిగింది శ్రీలంక జట్టు. చివరి దాకా పోరాడేందుకు చేసిన ప్రయత్నం ఫలించ లేదు. శ్రీలంక కేవలం 245 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ చమరీ 51 రన్స్ చేయగా మిగతా ఆటగాళ్లు ఎవరూ రాణించ లేక పోయారు . భారత బౌలర్ల ధాటికి కుప్ప కూలింది. అమన్ జోతి 3 వికెట్లు తీయగా స్నేహ్ రాణా 2 , శ్రీ చరణి 1 వికెట్ తీశారు.