కోట్లాది కళ్లన్నీ గుజరాత్ లోని అహ్మదాబద్ పైనే. యావత్ ప్రపంచం ఐపీఎల్ 2025 ఫైనల్ కు వేదిక కానుంది. ఇప్పటి వరకు జరిగిన టోర్నీలలో ఫైనల్ కు చేరుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్లు ఒక్కసారి కూడా కప్ గెలవలేదు. దీంతో ఎవరు గెలిచినా హార్ట్ బ్రేక్ కావడం ఖాయమని పేర్కొన్నారు దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇరు జట్లు ఇటు బౌలింగ్ లో అటు బ్యాటింగ్ లో బలంగా ఉన్నాయి. పోటీ మాత్రం హోరా హోరీగా కొనసాగడం ఖాయం.
ఎవరూ ఊహించని రీతిలో ఇరు జట్లు బలమైన ప్రత్యర్థి జట్లకు ఝలక్ ఇచ్చాయి. బెంగళూరులో విరాట్ కోహ్లీ ఫుల్ ఫామ్ లో ఉండడం ఆ జట్టుకు ప్లస్ పాయింట్. ఇదే సమయంలో బౌలింగ్ పరంగా హాజిల్ వుడ్ సూపర్ షో చేయడం కీలకం కానుంది. ఇక తనతో పోటీపడే పంజాబ్ జట్టును తక్కువగా అంచనా వేసేందుకు వీలు లేదు. ఎందుకంటే ఆ టీమ్ కు అత్యంత బలంగా మారాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. తను బ్యాటర్ గా ఫుల్ ఫామ్ లో ఉండగా కెప్టెన్సీ పరంగా ఫుల్ మార్కులు పడ్డాయి.
అన్ క్యాప్డ్ ప్లేయర్స్ ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ తో పాటు స్కిప్పర్ శ్రేయాస్ , శశాంక్ సింగ్, నెహాల్ వధేరా బలంగా ఉంది. అయ్యర్ 603 రన్స్ చేయగా, సిమ్రాన్ 523, ప్రియాన్స్ 451 రన్స్ తో ఆకట్టుకున్నారు. బౌలింగ్ పరంగా అర్ష్ దీప్ 18 వికెట్లు తీశాడు. జెమీసన్ , స్టోయినిస్, విజయ్ కుమార్ , చాహల్, హర్ ప్రీత్ బ్రార్ స్పిన్నర్స్ కీలకం కానున్నారు.