ఐపీఎల్ ఫైన‌ల్ లో పంజాబ్ టార్గెట్ 191 ర‌న్స్

నిర్ణీత ఓవ‌ర్ల‌లో బెంగ‌ళూరు స్కోర్ 9 వికెట్ల‌కు 190

అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఐపీఎల్ 2025 ఫైన‌ల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ ముందు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 191 ర‌న్స్ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ స్కిప్ప‌ర్ ర‌జ‌త్ పాటిదార్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ బౌల‌ర్లు క‌ట్టుదిట్ట‌గా బౌలింగ్ చేశారు. భారీ స్కోర్ చేయ‌కుండా క‌ట్ట‌డి చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. మ‌రోసారి శ్రేయాస్ అయ్య‌ర్ కెప్టెన్సీ సూప‌ర్ గా ఉంది. అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లు తీశాడు. జెమీస‌న్ 3 వికెట్లు తీశాడు.

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టులో మ‌రోసారి స‌త్తా చాటాడు విరాట్ కోహ్లీ . అరుదైన రికార్డ్ న‌మోదు చేశాడు. త‌ను 43 ప‌రుగులు చేశాడు. ఫిల్ సాల్ట్ 16 ర‌న్స్ చేయ‌గా, మ‌యాంక్ అగ‌ర్వాల్ 24 , కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ 26 ర‌న్స్ చేశారు. లివింగ్ స్ట‌న్ 25 ప‌రుగులు చేయ‌గా , జితేష్ శ‌ర్మ మెరుపులు మెరిపించాడు. త‌ను 2 ఫోర్లు 2 సిక్స్ ల‌తో 24 ర‌న్స్ చేశాడు. షెఫ‌ర్డ్ 17 ర‌న్స్ చేయ‌గా, కృనాల్ పాండ్యా 1, భువేన‌శ్వ‌ర్ కుమార్ 1 ర‌న్ మాత్ర‌మే చేశారు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆర్సీబీ 9 వికెట్లు కోల్పోయి 190 ర‌న్స్ చేసింది.

ఇక పంజాబ్ బౌల‌ర్ల‌లో అజ్మ‌తుల్లా 1 వికెట్ తీయ‌గా, చాహ‌ల్ 1, విజ‌య్ కుమార్ 1 చొప్పున తీశారు. అంత‌కు ముందు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది బీసీసీఐ. అమ‌రులైన వీర జ‌వాన్ల‌కు నివాళులు అర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం వ‌హించారు.

Comments (0)
Add Comment