సాయి సుద‌ర్శ‌న్ కు ఆరెంజ్ క్యాప్

ఐపీఎల్ మెగా టోర్నీలో అత్య‌ధిక ర‌న్స్

గుజ‌రాత్ – ఐపీఎల్ 2025 మెగా టోర్నీ ముగిసింది. ఆర్సీబీ విశ్వ విజేత‌గా నిలిచింది. విజేత‌కు రూ. 20 కోట్ల ప్రైజ్ మ‌నీ ద‌క్కింది. ర‌న్న‌ర్ అప్ గా నిలిచిన పంజాబ్ కు రూ. 12.5 కోట్లు ల‌భించాయి. ఆయా జ‌ట్ల ఆట‌గాళ్ల‌కు ప‌లు అవార్డులు వ‌రించాయి. టోర్నీలో అత్య‌ధిక ప‌రుగులతో అల‌రించాడు గుజ‌రాత్ టైటాన్స్ కు చెందిన ఆట‌గాడు సాయి సుద‌ర్శ‌న్. త‌ను ఆరెంజ్ క్యాప్ ను గెలుచుకున్నాడు.

ఇక పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ , సపోర్ట్ స్టాఫ్ రన్నరప్ షీల్డ్, ఐపీఎల్‌ లిమిటెడ్ ఎడిషన్ వాచ్‌లను అందుకున్నారు. తాజాగా ప్ర‌క‌టించిన అవార్డుల‌లో ఆరెంజ్‌ క్యాప్‌, పర్పుల్‌ క్యాప్‌, ఫెయిర్‌ ప్లే అవార్డులు ఉన్నాయి. ఈ సీజన్‌లో 759 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు సుంద‌ర్శ‌న్. ఇక మరో గుజరాత్‌ ప్లేయర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణకు పర్పుల్‌ క్యాప్‌ దక్కింది. ఈ సీజన్‌లో త‌ను 25 వికెట్లు పడగొట్టాడు. ఇద్దరికీ రూ.10 లక్షల చొప్పున బీసీసీఐ క్యాష్‌ రివార్డును బ‌హూక‌రించింది.

జితేశ్ శ‌ర్మ‌కు సూప‌ర్ స్ట్ర‌యిక‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. త‌న‌కు ల‌క్ష రూపాయ‌లు ల‌భించాయి. ఫాంట‌సీ కింగ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా త‌న‌కే ద‌క్కింది. మ్యాచ్ లో అత్య‌ధిక ఫోర్లు చేసినందుకు గాను ప్రియాన్ష్ ఆర్య‌కు రూ ల‌క్ష రివార్డుకు ఎంపిక‌య్యాడు. త‌న అద్భుత‌మైన బౌలింగ్ తో ఆక‌ట్టుకున్న కృనాల్ పాండ్యాకు గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. అంతే కాకుండా త‌న‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కు ఎంపిక‌య్యాడు. రెండు అవార్డుల‌కు క‌లిపి త‌న‌కు రూ. 6 ల‌క్ష‌లు ల‌భించాయి.

Comments (0)
Add Comment