హైదరాబాద్ – టాటా ఐపీఎల్ 2025 మెగా టోర్నీ చివరి దశకు చేరుకుంది. ఓ వైపు భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల మధ్య వాయిదా పడింది. మరోసారి ప్రారంభం కావడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఈ లీగ్ లో 10 జట్లు పాల్గొన్నాయి. ఆరు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇక అసలైన ప్లే ఆఫ్స్ కు ఎవరు చేరుకుంటారనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. ఇప్పటికే అద్భుతమైన ప్రతిభా పాటవాలతో మూడు జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్ లను ఖరారు చేసుకున్నాయి.
వాటిలో శుభ్ మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ , రజత్ పాటిదార్ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ లోని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్లు. కాగా చివరి నాలుగో స్థానంలో ఏ జట్టు చేరుకుంటుందనే దానిపై నెలకొన్న టెన్షన్ నిన్నటితో ముంబై వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ తో తేలి పోయింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ సత్తా చాటింది. సమన్వయంతో ఆడి ప్రత్యర్థి ఢిల్లీ క్యాపిటల్స్ కు చుక్కలు చూపించింది. 59 పరుగుల తేడాతో ఓడించింది. ప్లే ఆఫ్స్ లోకి చేరుకుంది ముంబై ఇండియన్స్. ఆ జట్టు ఐపీఎల్ టోర్నీకి సంబంధించి హాట్ ఫెవరేట్ గా ఉంది.