ముంబై ఇండియ‌న్స్ ను వీడ‌నున్న రోహిత్..?

ముగిసిన ఐపీఎల్ 2025 మెగా టోర్నమెంట్

గ‌త రెండు నెల‌లుగా కోట్లాది మంది అభిమానుల‌ను అల‌రిస్తూ వ‌స్తున్న ఐపీఎల్ 2025 మెగా టోర్నీ ముగిసింది. గ‌త కొన్నేళ్లుగా ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాడు. త‌న సార‌థ్యంలో ఐపీఎల్ క‌ప్ ను గెలిచాడు. టీం విజ‌యాల‌లో కీల‌క‌మైన పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో అద్భుతంగా ఆడాడు. కానీ కీల‌క‌మైన క్వాలిఫ‌య‌ర్ -2 మ్యాచ్ లో ఆశించిన మేర రాణించ‌లేక పోయాడు. ఇప్ప‌టికే టెస్టు ఫార్మాట్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

తాజాగా క్రికెట్ వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం మేర‌కు త‌ను ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టును వీడ‌నున్న‌ట్లు టాక్. వ‌చ్చే ఏడాది జ‌రిగే ఐపీఎల్ వేలం పాట‌లో ఇత‌ర జ‌ట్లు తీసుకునేందుకు వీలు క‌ల్పించాడు. కెరీర్ ప‌రంగా చూస్తే బ్యాట‌ర్ గా ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. కెప్టెన్ గా ఎన్నో గెలుపులు, మ‌రెన్నో క‌ప్ ల‌ను జ‌ట్టుకు అందించాడు. త‌న‌దైన ముద్ర వేశాడు.

ఇక జ‌ట్టు మేనేజ్ మెంట్ రోహిత్ శ‌ర్మ ను స్కిప్ప‌ర్ గా చేస్తార‌ని అనుకున్నారంతా. కానీ ఊహించ‌ని రీతిలో త‌న‌ను త‌ప్పించి ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేశారు. వారి ప్లాన్ ఫ‌లించింది. ఈ టోర్నీలో వ‌రుస‌గా నాలుగు మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలైంది. ఆ త‌ర్వాత పుంజుకుంది. ఊహించ‌ని రీతిలో ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. అటు నుంచి క్వాలిఫ‌య‌ర్ -2 కు చేరుకుంది. కానీ పంజాబ్ కొట్టిన దెబ్బ‌కు సెమీస్ నుంచి నిష్క్ర‌మించింది.

అయితే త‌ను త‌ప్పుకుంటాడా లేక జ‌ట్టు నుంచి నిష్క్ర‌మిస్తాడా అన్న విష‌యంపై రోహిత్ శ‌ర్మ క్లారిటీ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. మొత్తంగా ఈ హిట్ మ్యాన్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడ‌నేది ఉత్కంఠ నెల‌కొంది.

Comments (0)
Add Comment